టాలీవుడ్ అందాల భామ పూజా హెగ్డే ఇటీవల స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్తో కలిసి అల వైకుంఠపురములో నటించిన సంగతి తెలిసిందే.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ మూవీగా నిలవడంతో పూజా హెగ్డే తన నెక్ట్స్ చిత్రాన్ని రెడీ చేసే పనిలో పడింది.
ఇప్పటికే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రంలో ఆమె నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను జిల్ ఫేం దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరికొత్త అవతారంలో మనకు కనిపిస్తుండగా, పూజా హెగ్డే ఓ ప్రత్యేకమైన పాత్రలో నటిస్తుందనే వార్తలు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపించాయి.ఈ సినిమాలో పూజా హెగ్డే ఓ క్లాసికల్ డ్యాన్సర్ పాత్రలో నటిస్తుందనే వార్తలు వినిపించాయి.
కానీ ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదనే విషయాన్ని చిత్ర యూనిట్ క్లారిఫై చేసింది.ఈ సినిమాలో పూజా హెగ్డే పాత్రను తాము ఇప్పుడే రివీల్ చేయబోమని వారు తెలిపారు.
పీరియాడికల్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర చాలా కొత్తగా ఉంటుందని, ఆయన ఈ సినిమాలో రెండు విభిన్న పాత్రల్లో నటించనున్నాడని తెలుస్తోంది.మరి ప్రభాస్ చేయబోయే పాత్ర ఎలాంటిదా అనే ఆసక్తి అందరిలో నెలకొంది.
ఇక ఈ సినిమాను పీరియాడికల్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.కాగా ఈ సినిమాకు రాధే శ్యామ్ అనే టైటిల్ను పెట్టాలని చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.