టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే గురించి అందరికీ తెలిసిందే.ప్రస్తుతం టాలీవుడ్ లో తనకంటూ ఓ గుర్తింపు అందుకుంది.
అలా వైకుంఠపురంలో సినిమా తర్వాత తన నటనకు మంచి పేరు అందుకొని బుట్ట బొమ్మ పేరును సొంతం చేసుకుంది.ఇదిలా ఉంటే ప్రస్తుతం వరుస సినిమాల్లో అవకాశాలు కూడా అందుకుంది.ఇక రాధాకృష్ణ దర్శకత్వంలో ‘రాధేశ్యామ్’ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది.పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనున్న ఈ సినిమా రొమాంటిక్ పీరియాడికల్ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కనుంది.
ఇక ఈ సినిమా భారీ బడ్జెట్ తో రూపొందనుండగా.ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
ఇందులో పూజా హెగ్డే ప్రేరణ అన్ని పాత్రలో మెడికోగా నటిస్తుంది.ఇదిలా ఉంటే ప్రభాస్ ఈ బుట్ట బొమ్మ మాయలో పడ్డాడట.
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కొంతవరకు పూర్తవగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చాలావరకు పూర్తయ్యాయి.ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కోవిడ్ నేపథ్యంలో వాయిదా పడింది.
తాజాగా ప్రభాస్ తో సహా సినీ బృందంలో కీలక సభ్యులు ఈ సినిమాను చూశారట.ఇక ఈ సినిమా చూసిన తర్వాత ప్రభాస్ పూజా హెగ్డే నటనకు ఫిదా అయ్యాడట.
తన పర్ఫామెన్స్ చూసి బాగా మురిసిపోయాడట.అంతేకాకుండా ఈ సినిమాలో పూజా హెగ్డే పాత్ర హైలెట్ అంటూ ప్రభాస్ తెగ పొగుడుతున్నాడట.ఈ సినిమాలో కథ మొత్తం పూజా హెగ్డే చుట్టూ తిరుగుతుందని ఇదివరకే సినీ బృందం తెలిపారు.ఇందులో పూజ, ప్రభాస్ మధ్య సీన్లు అద్భుతంగా వచ్చాయని.వారిద్దరి మధ్య కెమిస్ట్రీ అదుర్స్ అని సినీ బృందం తెలుపుతుంది.