టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ లలో బుట్ట బొమ్మ పూజ హెగ్డే ఒకరు.ఈమె ప్రస్తుతం తెలుగు తమిళ హిందీ చిత్రాలతో ఎంతో బిజీగా ఉన్నారు.
ఆచార్య, రాదేశ్యామ్ వంటి చిత్రాలతో బిజీ అయిన పూజా హెగ్డే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా విజయాన్ని అందుకున్నారు.ఇకపోతే ప్రస్తుతం తన చిత్రాలు షూటింగ్ పూర్తి చేసుకున్న పూజా హెగ్డే అలా సరదాగా సినిమాలకు బ్రేక్ ఇచ్చి మాల్దీవులకు పయనించింది.
ఈ క్రమంలోనే పూజా హెగ్డే మాల్దీవుల వెకేషన్ కి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.
ఈ క్రమంలోనే మాల్దీవుల అందాలను వీక్షిస్తూ బుట్టబొమ్మ ఎంతో ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే తను ఉంటున్న గదికి సంబంధించిన ఫోటోలను అక్కడ సముద్ర అందాలను తన కెమెరాలో బంధించి ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు.ఈ ఫోటోలను వీడియోలను షేర్ చేస్తూ విరామం తీసుకునే సమయం ఇది.ఆ తర్వాత ఏంటో చూడండి అంటూ మాల్దీవుల పేరుతో ఉన్న హ్యాష్ ట్యాగ్ను జత చేసింది.ఈ క్రమంలో మాల్దీవులు సమీపంకు రాగానే విమానం నుంచి మాల్దీవుల ప్రాంతాన్ని తీసిన స్టన్నింగ్ వీడియోను సైతం షేర్ చేయడంతో ఈ ఫోటోలు వీడియోలు కాస్త వైరల్ గా మారాయి.
కాస్త విరామ సమయంలో ఇలా ఎంజాయ్ చేస్తున్న పూజా హెగ్డే మాల్దీవుల వెకేషన్ తర్వాత తాను ఒప్పుకున్న సినిమాలతో మరోసారి బిజీ కానున్నారు.ఇక అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న పూజా హెగ్డే త్వరలోనే ప్రభాస్ తో కలిసి నటించిన రాధేశ్యామ్, ఆచార్య సినిమాలు విడుదల కానున్నాయి.అయితే త్వరలోనే పూజా హెగ్డే కమిట్ అయిన తెలుగు తమిళ చిత్రాలతో బిజీ కానున్నారు.పూజా హెగ్డే మాల్దీవుల ఫోటోలపై మీరు ఓ లుక్కేయండి.