షూటింగ్ కి రానని మొండికేస్తున్న పూజా హెగ్డే

ప్రస్తుతం సౌత్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న ముద్దుగుమ్మ పూజా హెగ్డే.ఈ అమ్మడు ఓ వైపు రాదేశ్యామ్, ఆచార్య, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ సినిమాలని తెలుగులో చేస్తూ హిందీలో మరో మూడు సినిమాలు లైన్ లో పెట్టింది.

 Pooja Hegde Not Interested To Join Shoot, Tollywood, Radheshyam, Darling Prabhas-TeluguStop.com

ఓ విధంగా చెప్పాలంటే సౌత్ సినిమాలతో పాటు బాలీవుడ్ లో కూడా ఈ అమ్మడు పాగా వేయడానికి రెడీ అవుతుంది.ఇదిలా ప్రస్తుతం ఈమె నటిస్తున్న రాదేశ్యామ్ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది.

అయితే ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా ప్రభంజనం తీవ్ర స్థాయిలో ఉంది.సెకండ్ వేవ్ లో వేరియంట్ కరోనా మనుషుల ప్రాణాలని హరించేస్తుంది.

అలాగే లక్షలాది మంది ప్రతి రోజు కరోనా బారిన పడుతున్నారు.ఇప్పటికే టాలీవుడ్ లో చాలా మంది సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు.

ఈ నేపధ్యంలో ఇప్పటికే తెలుగులో చాలా వరకు సినిమా షూటింగ్ లు బంద్ చేసే చేసారు.అయితే కొన్ని పెద్ద సినిమాలు షూటింగ్ కొనసాగుతున్నాయి.

అలాగే రాదేశ్యామ్ సినిమా షూటింగ్ కూడా జరుగుతుంది.

అయితే ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ టైంలో తాను షూటింగ్ లో పాల్గొనడం కష్టం అని పూజ హెగ్డే చిత్ర యూనిట్ కి తేల్చి చెప్పినట్లు తెలుస్తుంది.

కృష్ణంరాజు, పూజా హెగ్డేకి సంబంధించి కొన్ని కీలక సన్నివేశాలని షూట్ చేయడానికి ప్లాన్ చేశారు.అయితే కృష్ణంరాజు వయస్సు రీత్యా ఈ సమయంలో షూటింగ్ లో రావాలని ఫోర్స్ చేసే అవకాశం లేదు.

ఇక పూజా హెగ్డే కూడా తాను ఎట్టి పరిస్థితిలో షూటింగ్ కి వచ్చే ప్రసక్తే లేదని కరాఖండీగా చెప్పేయడంతో తనని పరిస్థితిలో షూటింగ్ షెడ్యూల్ వాయిదా వేసుకోవాల్సి వచ్చిందని టాక్ వినిపిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube