యంగ్ హీరో నితిన్ నటించిన రీసెంట్ మూవీ భీష్మ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.ఈ సినిమాతో అదిరిపోయే సక్సెస్ అందుకున్న నితిన్, తన నెక్ట్స్ చిత్రాన్ని రిలీజ్కు రెడీ చేస్తున్నాడు.
‘రంగ్ దే’ అనే టైటిల్తో తెరకెక్కుతున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ ఇప్పటికే మెజారిటీ శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది.ఇక ఈ సినిమా తరువాత ఓ బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు ఈ హీరో రెడీ అవుతున్నాడు.
బాలీవుడ్లో సూపర్ హిట్ చిత్రంగా నిలిచిన ‘అంధాధున్’ను తెలుగులో రీమేక్ చేసేందుకు నితిన్ రెడీ అవుతున్నాడు.కాగా ఈ సినిమాలో హీరోయిన్గా చాలా మంది పేర్లు వినిపించాయి.
కానీ ఈ సినిమాకు మరింత బూస్ట్ తీసుకొచ్చేందుకు స్టార్ హీరోయిన్ పూజా హెగ్డేను చిత్ర యూనిట్ సంప్రదించినట్లు తెలుస్తోంది.కానీ ఈ సినిమాలో నటించేందుకు ఆమె ఒప్పుకోలేదట.
ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు పెద్దగా ప్రాముఖ్యత లేకపోవడమే దీనికి కారణమని చిత్ర వర్గాల్లో టాక్.కానీ రెమ్యునరేషన్ విషయంలో తేడా రావడంతోనే పూజా ఈ సినిమాకు నో చెప్పిందనే వార్త వినిపిస్తోంది.
ఏదేమైనా ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు పూజా నో చెప్పడంతో, ఇప్పుడు హీరోయిన్గా ఎవరు నటిస్తారా అనే అంశం చాలా ఆసక్తిగా మారింది.మరి ఈ సినిమాలో టబు చేసిన పాత్రలో ఎవరు నటిస్తారా అనే అంశం కూడా చాలా ఆసక్తికరంగా మారింది.
ఈ సినిమాను మేర్లపాక గాంధీ డైరెక్ట్ చేయనుండగా, నితిన్ సొంత బ్యానర్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు.ఇక రంగ్ దే చిత్రం తరువాతే ఈ సినిమాను మొదలుపెట్టేందుకు నితిన్ ప్లాన్ చేస్తున్నాడు.