టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తనదైన ముద్ర వేసుకున్న అందాల భామ పూజా హెగ్డే ప్రస్తుతం అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ సినిమా పూర్తి చేసింది.ప్రభాస్ కి జోడీగా చేసిన రాధేశ్యామ్ మూవీ షూటింగ్ ఫైనల్ స్టేజ్ లో ఉంది.
వీటి త్రివిక్రమ్, మహేష్ బాబు సినిమా కోసం పూజా హెగ్డే పేరు వినిపిస్తుంది.హిందీలో ఏకంగా ఈ అమ్మడు చేతిలో మూడు పెద్ద ప్రాజెక్ట్ లు ఉన్నాయి.
అందులో రణవీర్ సింగ్, సల్మాన్ ఖాన్ కి జోడీగా చేస్తున్నావి రెండు ఉండటం విశేషం.ఇదిలా ఉంటే రీసెంట్ గా కరోనా బారిన పడిన ఈ బ్యూటీ మళ్ళీ వేగంగానే కోలుకుంది.
ఇక ప్రస్తుతం ఇంటి వద్దనే ఉండటంతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో ముచ్చటించడంతో పాటు ఇంటర్వ్యూలు కూడా ఇస్తుంది.తాజాగా ఈ అమ్మడు నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ సినిమాలో తన పాత్ర గురించి పూజా హెగ్డే చెప్పుకొచ్చింది.
ఇందులో తాను స్టాండ్ అప్ కమెడియన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.అయితే దానికి సంబందించిన సన్నివేశాలు తక్కువగానే ఉంటాయని పేర్కొంది.
తనకి కామెడీ చేయడం అంటే చాలా ఇష్టం కాని స్టాండ్ అప్ కామెడీ అంటే అంత తేలికైన విషయం కాదు.దానికి సాధన కావాలి.
చక్కటి పంచ్లు, వ్యంగ్యం కలబోతగా సమయస్ఫూర్తితో వినోదాన్ని పండించాలి.స్వాభావికంగా మంచి హాస్యచతురత ఉంటేనే అది సాధ్యమవుతుంది.
అందుకే ఈ పాత్ర కోసం ఎంతగానో సాధన చేశాను అని చెప్పింది.మరి స్టాండ్ అప్ కమెడియన్ గా ఒక హీరోయిన్ ఎంత వరకు ఈ సినిమాలో కామెడీ పండించింది అనేది తెరపై చూస్తేనే తెలుస్తుంది.