టాలీవుడ్ బ్యూటీ పూజా హెగ్డే ప్రస్తుతం కెరీర్ పీక్ స్టేజీలో ఉందని చెప్పాలి.ఇప్పటికే వరుసబెట్టి సక్సెస్ చిత్రాలతో దూసుకుపోతున్న ఈ బ్యూటీ, ఇటీవల అల వైకుంఠపురములో చిత్రంతో అదిరిపోయే హిట్ అందుకుంది.
ఇక ఈ సినిమా అందుకున్న సక్సెస్తో తన నెక్ట్స్ చిత్రాలను కూడా లైన్లో పెట్టేందుకు ఈ బ్యూటీ రెడీ అయ్యింది.ఇందులో ప్రధానంగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన పూజా నటిస్తున్న ‘రాధేశ్యామ్’ చిత్రంపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో అతి భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక తెలుగుతో పాటు ఈ బ్యూటీ బాలీవుడ్లోనూ పూజా తన సత్తా చాటుతోంది.ఇప్పటికే ‘హౌస్ఫుల్ 4’ చిత్రంతో అదిరిపోయే హిట్ అందుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు ‘సర్కస్’ జాయిన్ అయ్యింది.
బాలీవుడ్ మాస్ చిత్రాల దర్శకుడు రోహిత్ శెట్టి యంగ్ హీరో రణ్వీర్ సింగ్తో కలిసి చేయబోయే ఓ ఫుల్టూ ఎంటర్టైనర్ మూవీగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.ఇక ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్గా పూజా హెగ్డేను చిత్ర యూనిట్ ఫైనల్ చేయడంతో ఆమె ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
టాలీవుడ్తో పాటు బాలీవుడ్లోనూ తన సత్తా చాటాలీని చూస్తున్న ఈ బ్యూటీకి అక్కడ కూడా భారీ ఆఫర్లు వస్తుండటంతో పూజా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ చేస్తున్నారు.
కాగా తెలుగులో ప్రభాస్ సరసన రాధేశ్యామ్ చిత్రంతో పాటు యంగ్ హీరో అఖిల్ అక్కినేని సరసన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ చిత్రంలో కూడా ఈ బ్యూటీ నటిస్తోంది.
ఈ రెండు సినిమాల షూటింగ్లు ప్రస్తుతం తిరిగి ప్రారంభం అయ్యాయి.భారీ ఆఫర్లు పూజా చెంతకు వస్తుండటంతో ఆమె తన రెమ్యునరేషన్ను పెంచేసినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే తెలుగు సినిమాల్లో ఆమె కళ్లు చెదిరే రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.ఏదేమైనా సినిమాల్లో తన పర్ఫార్మెన్స్తో వరుస ఛాన్సులు కొట్టేస్తున్న ఈ బ్యూటీ ఇప్పుడు బాలీవుడ్లోనూ తన మార్క్ వేయడం ఖాయమని సినీ వర్గాలు అంటున్నాయి.