టాలీవుడ్లో ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారింది పూజా హెగ్డే.ఇటీవల స్టైలిష్ స్టార్తో కలిసి అల వైకుంఠపురములో సినిమాలో నటించిన ఈ బ్యూటీ, ఈ సినిమాతో అదిరిపోయే బ్లాక్బస్టర్ను అందుకుంది.
ఇక ఈ సినిమా తరువాత ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన రాధేశ్యామ్ చిత్రంలో నటిస్తోంది ఈ బ్యూటీ.కాగా ఈ సినిమాతో పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకునేందుకు ఈ బ్యూటీ ప్లాన్ చేస్తోంది.
కాగా ఈ బ్యూటీకి అసలు హీరోయిన్ కావాలనే ఆలోచనే లేదట.తాను చిన్నప్పటి నుండి మగపిల్లాడిలా హెయిర్ కట్టింగ్ చేసుకుని ఉండేదట.అబ్బాయిలా ప్రవర్తిస్తూ అన్ని రకాల స్పోర్ట్స్ ఆడుతూ ఉండేదట.అయితే ఆమె కేవలం గ్లామర్ ఫీల్డ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుందామని మోడల్గా వచ్చిందట.
అయితే ఆమెకు అనుకోకుండా సినిమా ఆఫర్లు రావడంతో ఇప్పుడు స్టార్ హీరోయిన్గా ఎదిగానని ఆమె చెప్పుకొచ్చింది.
ఏదేమైనా అసలు హీరోయిన్ అవ్వాలనే ఆలోచన కూడా లేని పూజా హెగ్డే ఇప్పుడు స్టార్ హీరోయిన్గా మారడంతో ఆమె అదృష్టం చూసి పలువురు అసూయ పడుతున్నారు.
కాగా పూజా హెగ్డే కేవలం తెలుగులోనే కాకుండా హిందీలో కూడా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది.మరి ఈ బ్యూటీ రాధేశ్యామ్ చిత్రంతో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
ప్రస్తుతం ఆమె చేస్తున్న రాధేశ్యామ్ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.