టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ఇమేజ్ తో దూసుకుపోతున్న అందాల భామ పూజా హెగ్డే.ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో ఓ వైపు పాన్ ఇండియా మూవీ రాధే శ్యామ్, అలాగే అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ సినిమాలు ఉన్నాయి.
అలాగే ఎన్ఠీఆర్, త్రివిక్రమ్ సినిమా కోసం కూడా ఆమెనే పరిశీలిస్తున్నట్లు టాక్ నడుస్తుంది.తెలుగులో ఇక సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా దూసుకుపోతున్న పూజా హెగ్డే మనసంతా బాలీవుడ్ మీదనే ఉందని తెలుస్తుంది.
తెలుగు సినిమాలు చేస్తూనే బాలీవుడ్ లో సత్తా చాటి అక్కడ కూడా స్టార్ హీరోయిన్ గాపాగా వేయాలని అనుకుంటుంది.మొదటి సినిమా హృతిక్ రోషన్ లాంటి స్టార్ తో చేసిన కూడా ఆ సినిమా డిజాస్టర్ కావడంతో పూజా హెగ్డే పేరు బాలీవుడ్ లో వినిపించలేదు.
దీంతో తెలుగులోకి వచ్చి ఇక్కడ వరుస హిట్స్ తో మంచి జోష్ లోకి వచ్చి ఇప్పుడు బాలీవుడ్ దర్శక నిర్మాతల దృష్టి తనపై పడేలా చేసుకుంది.
ఈ నేపధ్యంలో సల్మాన్ ఖాన్ నెక్స్ట్ సినిమాలో చేసే అవకాశాన్ని పూజా హెగ్డే సొంతం చేసుకుంది.
అలాగే అక్షయ్ కుమార్ తో కూడా ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.ఇప్పుడు మరో సినిమా ఆమె చేతికి చిక్కింది.బాలీవుడ్ లో రీమేక్ చిత్రాలతో వరుస హిట్స్ కొట్టిన రోహిత్ శెట్టి దర్శకత్వంలో రణవీర్ సింగ్ లాంటి క్రేజీ హీరోతో రొమాన్స్ చేసే అవకాశం సొంతం చేసుకుంది.ప్రస్తుతం రోహిత్ శెట్టి అక్షయ్ కుమార్ తో సూర్య వంశీ అనే సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమాతర్వాత మరో సౌత్ రీమేక్ ని రణవీర్ తో చేయడానికి రెడీ అయ్యాడు.ఈ రీమేక్ కోసం పూజా హెగ్డేని హీరోయిన్ గా ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది.