టాలీవుడ్లో ప్రస్తుతం ఫుల్ స్వింగ్లో ఉన్న బ్యూటీ పూజా హెగ్డే వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది.ఇప్పటికే స్టార్ హీరోల సరసన వరుసబెట్టి సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ, అటు చిన్న హీరోలతో కూడా సినిమాలు చేస్తోంది.
అయితే కేవలం టాలీవుడ్లోనే కాకుండా తమిళ, హిందీ భాషల్లో కూడా పూజా హెగ్డేకు అదిరిపోయే డిమాండ్ ఏర్పడటంతో ఆమె అక్కడ కూడా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది.అయితే తమిళంలో పూజా హెగ్డేకు ఓ స్టార్ హీరో సరసన నటించే ఛాన్స్ రావడంతో ప్రస్తుతం కోలీవుడ్ వర్గాల్లో ఇది హాట్ టాపిక్గా మారింది.
తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న 65వ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్గా సెలెక్ట్ అయ్యింది.ఈ సినిమాను దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తుండగా, సన్ పిక్చర్స్ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కించేందుకు రెడీ అయ్యారు.
అయితే ఈ సినిమాలో నటించేందుకు పూజా హెగ్డే కళ్లు చెదిరే రెమ్యునరేషన్ పుచ్చుకోబుతున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమా కోసం ఏకంగా రూ.3.5 కోట్ల రెమ్యునరేషన్ పుచ్చుకోంటందట పూజా పాప.దీంతో ఈ సినిమాలో పూజా పాత్ర ఎలాంటి ప్రాముఖ్యతను కలిగి ఉంటుందా అని తమిళ తంబీలు అప్పుడే అంచనాలు వేస్తున్నారు.
ఏదేమైనా పూజా హెగ్డే తనకున్న డిమాండ్ కారణంగా రెమ్యునరేషన్ను అమాంతం పెంచేసినట్లు తెలుస్తోంది.
ఇక పూజా ప్రస్తుతం టాలీవుడ్లో ప్రభాస్ సరసన రాధేశ్యామ్, అక్కినేని అఖిల్ సరసన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ రెండు సినిమాలు కూడా వేసవి కానుకగా రిలీజ్ చేసేందుకు ఆయా చిత్ర యూనిట్లు రెడీ అయ్యాయి.
మరి విజయ్ సరసన పూజా చేయబోయే సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.ఏదేమైనా తమ అభిమాన నటి ఇంతమేర రెమ్యునరేషన్ తీసుకుంటుండటంతో ఆమె ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.