ఇండస్ట్రీకి చెందిన నటీనటులు మొదట ఏ సినిమాలలో అవకాశాలు వచ్చినా వెంటనే ఒప్పుకుంటారు.అవి హిట్ అయినా కాకున్నా వచ్చే అవకాశాలను వదులుకోరు.
కానీ ఆ నటీనటులు ఒక స్టార్ హోదాను సంపాదించుకున్నాక చిన్న సినిమాలను, చిన్న హీరోలను అసలు లెక్క చేయరు.అంతేకాకుండా గతంలో నటించిన నటులతో కూడా మళ్లీ చెయ్యమని ముఖం ముందే చెప్పేస్తారు.
అందులో ఓ హీరోయిన్ కూడా ఆ హీరోలది తన స్థాయి కాదు అంటూ టైమ్ లేదంటూ రిప్లై ఇచ్చింది.ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు.
ప్రస్తుతం మూడు భాషలలో ఓ రేంజ్ లో ఏలుతున్న బుట్ట బొమ్మ పూజా హెగ్డే.ఈ అమ్మడి క్రేజ్ ఇప్పుడు అందనంత ఎత్తులో ఉంది.టాలీవుడ్, కోలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో వరుస సినిమాలతో బాగా బిజీగా ఉంది.ఇక రెండేళ్ల వరకు తనకు డేట్స్ ఖాళీగా లేవని తెలిసింది.
అయినా కూడా వరుస సినిమాలలో భారీ పారితోషకం ఆఫర్ చేసినా కూడా అవకాశాలను వదులుకుంటుంది.
నితిన్ నటిస్తున్న మాచర్ల నియోజకవర్గం సినిమాలో కూడా భారీ రెమ్యూనరేషన్ తో అవకాశం రాగా అందుకు ఈ బ్యూటీ నో చెప్పిందట.అంతేకాకుండా ఇదివరకు నటించిన అఖిల్ అక్కినేని, వరుణ్ తేజ్ సినిమాలలో నటించడం కుదరదని ఆ హీరోలది నా స్థాయి కాదు అంటూ అంతే కాకుండా టైం లేదు అంటూ రిప్లై ఇచ్చింది.
ప్రస్తుతం తను ఆచార్య సినిమాలో రామ్ చరణ్ సరసన నటిస్తుంది.ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమాలో కూడా నటించిన సంగతి తెలిసిందే.తమిళంలో విజయ్ నటిస్తున్న బీస్ట్ సినిమాలో బిజీగా ఉంది.
అంతేకాకుండా మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఈమె పేరు వినిపిస్తుంది.ఇక మరో వైపు పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్లో కూడా పూజ హెగ్డే పేరు వైరల్ గా మారింది.
బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ నటిస్తున్న సినిమాలో నటిస్తుంది.మొత్తానికి స్టార్ హీరోల సినిమాలలో బాగా బిజీగా ఉంది పూజ.