మంగళూరు భామ పూజా హెగ్డే, మిస్ ఇండియా కిరీటం సొంతం చేసుకొని మోడలింగ్ లో అడుగుపెట్టి తరువాత టాలీవుడ్ లో ముకుందా సినిమాలో అవకాశం సొంతం చేసుకొని వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.ప్రస్తుతం టాలీవుడ్ లో ఈమె క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతుంది.
స్టార్ హీరోలతో సినిమా అంటే ముందు పూజా హెగ్డే వైపు దర్శకులు చూస్తున్నారు.ఇక ఆమె క్రేజ్ కి తగ్గట్లే రెండు, మూడు కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుంది.
ప్రస్తుతం తెలుగులో ప్రభాష్ కి జోడీగా ఓ డియర్ అనే పాన్ ఇండియా మూవీలో నటిస్తుంది.తెలుగులో సినిమాలు చేస్తూనే బాలీవుడ్ లో కూడా ప్రయత్నాలు చేస్తున్న ఈ బుట్టబొమ్మకి అదిరిపోయే అవకాశం వచ్చింది.
సల్మాన్ ఖాన్ కి జోడీగా నటించే అవకాశాన్ని బాలీవుడ్ లో పూజా సొంతం చేసుకుంది.బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ తో నటించే కుర్ర హీరోయిన్స్ కి రెమ్యునరేషన్ పెద్దగా ఉండదు.
అయితే ఇప్పుడు పూజా హెగ్డేకి ఉన్న క్రేజ్ నేపధ్యంలో ఏకంగా నలుగు కోట్లు నిర్మాతలు ఆఫర్ చేసినట్లు తెలుస్తుంది.నిజానికి పూజా హెగ్డేకి ఇప్పుడున్న గుర్తింపుతో పోల్చుకుంటే బాలీవుడ్ లో అది ఎక్కువ మొత్తమనే చెప్పాలి.
సల్మాన్ ఖాన్ సినిమా హిట్ అయితే మాత్రం ఆమె సౌత్ సినిమాలు పూర్తిగా పక్కన పెట్టి బాలీవుడ్ లోనే పాగా వేసే అవకాశాలు ఉన్నాయని దీనిని బట్టి తెలుస్తుంది.అందాల ప్రదర్శనలో ఏ మాత్రం హద్దులు పెట్టుకోకుండా బాలీవుడ్ దర్శక, నిర్మాతలకి కావాల్సిన విధంగా ఉండే పూజా హెగ్డే అందాన్ని వారు అంత ఈజీగా వదిలే అవకాశం ఉండదు.
ఈ నేపధ్యంలో ప్రభాస్ సినిమా తర్వాత ఆమెని సౌత్ లో పెద్దగా చూడకపోవచ్చు అనే మాట వినిపిస్తుంది.