టాలీవుడ్ స్టార్ బ్యూటీ పూజా హెగ్డే ప్రస్తుతం తెలుగులో వరుసబెట్టి సినిమాలు చేస్తోంది.వరుస హిట్లతో ఈమె చూపిస్తున్న స్పీడుకు స్టార్ హీరోలు ఆమెను తమ సినిమాల్లో నటింపజేసేందకు ఆసక్తి కనబరుస్తున్నారు.
ఇక ఈ ఏడాదిని అల వైకుంఠపురములో వంటి బిగ్గె్స్ట్ బ్లాక్బస్టర్ హిట్తో స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రంలో హీరోయిన్గా నటిస్తు్న్న సంగతి తెలిసిందే.
పీరియాడికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ సినిమాలో ప్రభాస్ సరస పూజా హెగ్డే నటిస్తోండగా, ఇటీవల షూటింగ్ కోసం చిత్ర యూనిట్ జార్జియా వెళ్లిన సంగతి తెలిసిందే.
అయితే ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాపిస్తుండటంతో పలు దేశాలు సినిమా షూటింగ్లను రద్దు చేశారు.దీంతో జార్జియాలో ఉన్న ప్రభాస్20 చిత్ర యూనిట్ వీలైనంత వరకు షూటింగ్ను ముగించేసుకుని తిరుగు ప్రయాణం అయ్యారు.
అయితే పూజా మాత్రం అక్కడే ఉండి జార్జియాలోని పలు ప్రదేశాలను వీక్షించేందుకు వెళ్లింది.
దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి.
ఇక ఈ ఫోటోలతో తన సంతోషాన్ని పూజా వ్యక్త పరిచింది.మొత్తానికి కరోనా పుణ్యమా అని షూటింగ్ ముగియగానే వెనుదిరగకుండా అక్కడున్న ప్రదేశాలను చుట్టివస్తున్న పూజాను చూసి ఆమె ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.