టాలీవుడ్ డైరెక్టర్ గుణశేఖర్ తాజాగా తన కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.ఈ సినిమాకు ‘శాకుంతలం’ అనే టైటిల్ను గుణశేఖర్ ప్రకటించాడు.
కాగా మహాభారతంలోని ఆదిపర్వంలో భాగమైన శకుంతల-దుష్యంతుల ప్రేమకథను ఈ సినిమా ద్వారా మనకు మరోసారి చూపించేందుకు గుణశేఖర్ రెడీ అవుతున్నాడు.ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా అత్యంత భారీ బడ్జెట్తో రూపొందించేందుకు ఆయన ప్లాన్ చేస్తున్నాడు. కాగా ఈ ప్రెస్టీజియస్ చిత్రంలో నటీనటులు ఎవరనే విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.అయితే ఈ సినిమాలో శకుంతల పాత్ర కోసం గుణశేఖర్ స్టార్ హీరోయిన్ను తీసుకోవాలని చూస్తున్నాడట.
ఇందులో భాగంగా అనుష్క, పూజా హెగ్డే, సమంత లాంటి పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి.అయితే అనుష్కతో ఇప్పటికే ‘రుద్రమదేవి’ అనే సినిమాను తీసిన సంగతి తెలిసిందే.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలవడంతో ఇప్పుడు ‘శాకుంతలం’ చిత్రంలో వేరే హీరోయిన్ను తీసుకోవాలని చూస్తున్నాడు.అయితే ఈ సినిమాలో పూజా హెగ్డే నటిస్తుందనే వార్తలో ఎలాంటి నిజం లేదని చిత్ర యూనిట్ తెలిపింది.
శకుంతల పాత్ర కోసం పూజా హెగ్డేను సంప్రదించినట్లు వస్తున్న వార్తలో ఎలాంటి నిజం లేదని చిత్ర యూనిట్ తెలిపింది.ఈ సినిమాలో నటీనటుల విషయంపై ఇంకా ఎవరినీ సంప్రదించలేదని గుణశేఖర్ తెలిపాడు.
దీంతో పూజా హెగ్డే ఈ సినిమాలో నటిస్తుందనే వార్తలకు చెక్ పడిందని చెప్పాలి.మరి శకుంతల పాత్రలో ఎవరు నటిస్తారా అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.
ఇక ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్తో నీలిమ గుణ ప్రొడ్యూస్ చేస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి అంటున్నారు ప్రేక్షకులు.మరి ఈ సినిమాలో లీడ్ రోల్లో ఎవరు నటిస్తారనేది ఆసక్తికరంగా మారింది.