అక్కినేని నాగార్జున వారసుడుగా చైతు తర్వాత టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన నటుడు అఖిల్.మనం సినిమాలో గెస్ట్ పాత్రలో మెరిసిన అఖిల్ లుక్స్ చూసిన తర్వాత అతను హీరో మెటీరియల్ అని, అక్కినేని ఫ్యామిలీ నుంచి స్టార్ హీరోగా ఎదిగే అవకాశం ఉన్నవాడని గొప్పగా చెప్పుకున్నారు.
ఆ తర్వాత వివి వినాయక్ దర్శకత్వంలో అఖిల్ సినిమాతో అఖిల్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు.అయితే మొదటి సినిమాలోనే తన వయసుకి మించిన కమర్షియల్ కథతో పాటు భారీ యాక్షన్ సన్నివేశాలు, కంటెంట్ సినిమాతో డిజాస్టర్ ని ఖాతాలో వేసుకున్నాడు.
తరువాత విక్రమ్ కె కుమార్ లాంటి టాలెంటెడ్ దర్శకుడుతో అది కూడా మనం లాంటి సూపర్ హిట్ తర్వాత హలో సినిమాని అఖిల్ హీరోగా తెరకెక్కించారు.ఇది కూడా డిజాస్టర్ అయిపొయింది.
తరువాత మిస్టర్ మజ్ను అంటూ తనకి సరిపోయే ప్రేమ కథతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఇది కూడా ఫ్లాప్ గానే మిలిగింది.దీంతో మంచి హైప్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చి ఇప్పుడు ఎలాంటి బజ్ లేని హీరోగా మారిపోయాడు.
ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ లాంటి ఫ్లాప్ దర్శకుడుతో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ తో ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అయ్యాడు.ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన కూడా ఏ మాత్రం బజ్ రాలేదు.
ప్రస్తుతం సైలెంట్ గా షూటింగ్ చేసుకుంటూ పోతున్నారు.ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డేని తీసుకున్నారు.
ప్రస్తుతం గోల్డెన్ లెగ్ తో వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న ఈ భామతో అయిన సినిమా మీద బజ్ పెరిగి పోజిటివ్ టాక్ తెచ్చుకుంటుంది అని ఆమెని ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది.అయితే పూజాహేగ్దే గతంలో నాగ చైతన్యతో ఓ లైలా కోసం అనే సినిమాలో నటించింది.
ఈ సినిమా అతని కెరియర్ డిజాస్టర్ లలో ఒకటిగా మారింది.మరి అన్నకి హిట్ ఇవ్వని గోల్డెన్ లెగ్ పూజా తమ్ముడుకి హిట్ ఇస్తుందేమో చూడాలి.
.