టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దశాబ్దం పాటు తిరుగులేని ఇమేజ్ తో దూసుకుపోయిన అందాల భామ సమంత.ప్రస్తుతం సమంత ఎక్కువగా కమర్షియల్ సినిమాలు కాకుండా ఫీమేల్ సెంట్రిక్ కథలు, అలాగే ప్రాధాన్యత ఉన్న హీరోయిన్ పత్రాలు చేయడానికి మాత్రమే ఆసక్తి చూపిస్తుంది.
ఇక ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా క్రేజీ ఆఫర్స్ తో దూసుకుపోతున్న నటి పూజా హెగ్డే. ఈ అమ్మడు తెలుగుతో పాటు హిందీలో కూడా అవకాశాలు సొంతం చేసుకుంటూ దూసుకుపోతుంది.
వీరిద్దరిలో ఎక్కువ అందంగా ఉండేది అంటే కచ్చితంగా చాలా మంది పూజా హెగ్డేకి ఓటు వేస్తారు.ఆమె మిస్ ఇండియా పోటీలలో కూడా పాల్గొంది.
ఇక సమంత కెరియర్ ఆరంభంలో నార్మల్ లుక్ లో ఉన్న పేస్ లో స్మైల్ ఆమెకి అందాన్ని తీసుకొచ్చింది.అలాగే అవకాశాలు పెద్ది స్టార్ హీరోయిన్ ని చేసింది.
అయితే ఆ మధ్య ఈ ఇద్దరు హీరోయిన్లు అభిమానుల మధ్య చిన్న కోల్డ్ వార్ నడిచింది.దానికి కారణం పూజా హెగ్డే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి సమంత నుంచి ఉద్దేశిస్తూ కొన్ని వాఖ్యలు వచ్చాయి.
సమంత ఏమంత అందంగా ఉండదు అనే పోస్ట్ చూసి సమంత ఫ్యాన్స్ రెచ్చిపోయారు.అయితే ఆ పోస్ట్ వచ్చిన తర్వాత తన అకౌంట్ హ్యాక్ అయ్యిందని పూజా హెగ్డే చెప్పిన అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.అయితే ఈ విషయం తరువాత సద్దుమణిగింది.ఇప్పుడు శాకుంతలం సినిమా విషయంలో పూజాహెగ్డే ఫ్యాన్స్ రియాక్ట్ అవుతున్నారు.శాకుంతలం సినిమా కోసం గుణశేఖర్ ముందుగా పూజా హెగ్డేని సంప్రదించారని ప్రచారం జరిగింది.ఫైనల్ గా టైటిల్ రోల్ కోసం సమంతని ఫైనల్ చేశారు.
అయితే సమంత ఫైనల్ కావడం వెనుక దిల్ రాజు హస్తం ఉందనే వార్త బయటకొచ్చింది.దీంతో ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఉండటం వలన పైరవీలు నడిపి పూజా హెగ్డేకి రావాల్సిన పాత్రని సమంత తన్నుకుపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇందులో వాస్తవం ఎంత అనేది పక్కన పెడితె సోషల్ మీడియాలో ఇద్దరు హీరోయిన్ ఫ్యాన్స్ మాత్రం యుద్ధం చేసుకుంటున్నారు.