టాలీవుడ్ సినీ నటి గ్లామర్ బ్యూటీ పూజా హెగ్డేఅలా వైకుంఠపురంలో సినిమాతో బుట్ట బొమ్మగా క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ టాలీవుడ్ బుట్ట బొమ్మగా నిలిచింది.స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు అందుకుంది.
హీరోయిన్ గానే కాకుండా పలు సినిమాలలో స్పెషల్ సాంగ్ లో కూడా నటించింది.ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.
నిజానికి పూజా హెగ్డే ఏ సినిమాలోనైనా అడుగు పెడితే చాలు సెంటిమెంట్ గా భావిస్తారు దర్శక నిర్మాతలు.ఇప్పటివరకు ప్రతి ఒక్క సినిమాతో మంచి గుర్తింపు అందుకున్న పూజా హెగ్డే ప్రస్తుతం పలు సినిమాలలో కూడా బిజీగా ఉంది.
ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను, ఫన్నీ వీడియోలను బాగా షేర్ చేసుకుంటుంది.అంతేకాకుండా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకుంది.
ఇక తాజాగా సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో షేర్ చేయగా అందులో తనకు ఓ సర్ ప్రైజ్ గిఫ్ట్ వచ్చినట్లుగా కనిపిస్తుంది.ఇక ఈ గిఫ్ట్ గురించి ఓ పోస్టు కూడా చేసింది పూజ. మామూలుగా క్రిస్మస్ వస్తే ఇలాంటి గిఫ్ట్స్ ఇంటికి వస్తుంటాయని తెలిపింది.ఇక తన ఇంట్లోకి యాపిల్ కంపెనీ నుంచి మ్యాక్ కంప్యూటర్ వచ్చిందని తెలిపింది.
ఇక అలాంటి కొత్త వస్తువులను ముందుగా తానే ఓపెన్ చేయాలని చిన్నతనం నుండి అల్లరి చేస్తూ ఉండేదట.అలా తనకు కొత్తవి ఓపెన్ చేయడం అంటే ఎంతో ఇష్టమట.ఇలాంటివి ఓపెన్ చేయడం లో తనకు సంతృప్తి ఉంటుందని తెలిపింది.ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ వరుస సినిమాలతో బిజీగా ఉండగా అందులో చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాలో రామ్ చరణ్ సరసన నటిస్తుంది.ఇక అఖిల్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, ప్రభాస్ తో రాధేశ్యామ్ సినిమాలో బిజీగా ఉంది.