టాలీవుడ్ సినీ నటి గ్లామర్ బ్యూటీ పూజా హెగ్డే.అలా వైకుంఠపురం సినిమా తో బుట్ట బొమ్మ గా ఓ క్రేజ్ సంపాదించుకుంది.
టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించి స్టార్ స్థానంలో నిలిచింది.హీరోయిన్ గానే కాకుండా స్పెషల్ సాంగ్ లో కూడా మెప్పించింది ఈ బ్యూటీ.
మహర్షి, రంగస్థలం, గద్దల కొండ గణేష్, అరవింద సమేత వంటి సినిమాల్లో తన నటనకు మంచి సక్సెస్ అందుకుంది.
ఇక ఈ బుట్ట బొమ్మ ఏ సినిమాలో అడుగుపెట్టిన దర్శక నిర్మాతలు మాత్రం ఓ సెంటిమెంట్ గా భావిస్తారట.
అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది పూజ.తనకు సంబంధించిన ఫోటోలను, వీడియో లను అభిమానులతో తెగ పంచుకుంటుంది.ఇదిలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ తన సోషల్ మీడియా ఖాతాలో మరో బుట్ట బొమ్మ ఫోటో ను షేర్ చేసుకోగా ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారింది.
అందులో పైజామా గర్ల్స్.
ట్విన్నింగ్ అప్!! అంటూ తన బంధువు అయినా ఓ అమ్మాయితో తను కూడా ఒకే రకమైన పైజామా ధరించి ఫోటో షేర్ చేసుకుంది.
ఇది చూసిన నెటిజనులు పూజ తో పాటు ఉన్న మరో బుట్ట బొమ్మ ఎవరు అంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు.ఇక ప్రస్తుతం పూజ హెగ్డే.ప్రభాస్ నటిస్తున్న రాధేశ్యామ్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.
అంతేకాకుండా అక్కినేని అఖిల్ సరసన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో కూడా నటిస్తుంది.టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా పలు సినిమాలలో నటిస్తుంది.
ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ వల్ల షూటింగులు వాయిదా పడటంతో.సెలబ్రిటీలు అంతా ఇలా తమ ఫోటోల షేర్ల తో బిజీగా ఉన్నారు.