టాలీవుడ్లో ప్రస్తుతం పూజా హెగ్డే స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న విషయం తెల్సిందే.ఈ అమ్మడు చేసిన అల వైకుంఠపురంలో చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఈమెకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి.
ఈ సమయంలో ఈమె తన పారితోషికంను భారీగా పెంచడంతో తెలుగు నిర్మాతలు నోరు వెళ్లబెడుతున్నారు.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఏకంగా నాలుగు కోట్ల రూపాయల పారితోషికంను డిమాండ్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.
తెలుగులో ఏ హీరోయిన్ కూడా నాలుగు కోట్ల రూపాయల పారితోషికంను డిమాండ్ చేయరు.ఎవరో చాలా అరుదుగా మాత్రమే చాలా పెద్ద సినిమాకు మాత్రమే అంత భారీ పారితోషికంను వసూళ్లు చేస్తారు.
కాని పూజా హెగ్డే మాత్రం ఒక సాదారణ బడ్జెట్ చిత్రానికి కూడా ఈ స్థాయిలో పారితోషికం డిమాండ్ చేయడంతో బాబోయ్ ఈమెకు తెలుగులో నటించే ఆసక్తి ఉందా అంటూ కొందరు నిర్మాతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
బాలీవుడ్లో ఈమెకు సల్మాన్ ఖాన్తో నటించే ఛాన్స్ వచ్చింది.ఆ కారణంగానే ఈ అమ్మడు భారీగా పారితోషికంను డిమాండ్ చేస్తోంది.సల్మాన్కు జోడీగా నటించబోతున్నందుకు గాను నాలుగు కోట్ల రూపాయలను దక్కించుకుంది.
మరి అంతే పారితోషికం ఇక్కడ రాబట్టడం సాధ్యమేనా అంటూ నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు.పారితోషికం తగ్గించుకోకుంటే ఈ అమ్మడు తెలుగులో నటించడం అనుమానమే అంటున్నారు.