టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వరుస సినిమాలతో దూసుకుపోతున్న మంగళూరు భామ పూజాహెగ్డే.తాజాగా అల వైకుంఠపురంలో సినిమాతో మరో సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్న ఈ భామ ఇప్పుడు ప్రభాస్ తో రొమాన్స్ లో బిజీగా ఉంది.
ఈ సినిమాతో పాటు బాలీవుడ్ లో కూడా సల్మాన్ తో రొమాన్స్ చేసే అవకాశం సొంతం చేసుకుందనే టాక్ వినిపిస్తుంది.మరో వైపు తెలుగులో ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా కోసం పూజా హెగ్డేని ఫైనల్ చేసారనే మాట కూడా బలంగా వినిపిస్తుంది.
అలాగే పవన్ కళ్యాణ్, క్రిష్ మూవీలో కూడా పూజాహెగ్డే పేరు వినిపిస్తుంది.
ఇదిలా ఉంటే సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా మన అందాల భామలు ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ తమ గ్లామర్ ఫోటోలని లేదంటే ఏవైనా ఇంటరెస్టింగ్ ఫోటోలు షేర్ చేస్తూ ఉంటారు.
అలాగే ఈ భామలు పెట్స్ కి ఎక్కువగా ఇష్టపడి పెంచుకుంటారు.వాటితో అనుబంధం కూడా కలిగి ఉంటారు.తాజాగా పూజాహెగ్డే తన పెంపుడు కుక్కని ఎత్తుకొని ముద్దు చేస్తున్న ఫోటోని షేర్ చేసింది.దాని క్రింద ఆసక్తికరమైన కామెంట్ కూడా పెట్టింది.
నేను తనతో పీకల్లోతు ప్రేమలో ఉన్నా, నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకండి అని పోస్ట్ పెట్టింది.ఈ పోస్ట్, ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.