ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు దేశ వ్యాప్తంగా సినీ అభిమానులు మరియు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా రాధేశ్యామ్.ఈ సినిమా షూటింగ్ ఇటలీలో జరుగుతున్న విషయం తెల్సిందే.
గత నెల రోజులుగా అక్కడ చిత్రీకరణ జరుపుకుంటున్న రాధేశ్యామ్ త్వరలో ఇండియాకు రాబోతున్నట్లుగా తెలుస్తోంది.ఇప్పటికే రాధేశ్యామ్ షూటింగ్లో పాల్గొన్న పూజా హెగ్డే ఇండియాకు వచ్చేసింది.
తన పోర్షన్ను పూర్తి చేసుకున్న ఈ అమ్మడు ఇప్పుడు కొత్త సినిమాను మొదలు పెట్టేందుకు సిద్దం అయ్యింది.తెలుగులో ఈమె రాధేశ్యామ్తో పాటు మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే.
అఖిల్ తో ఆ సినిమాను చేస్తున్న ఈ అమ్మడు మరో రెండు మూడు రోజుల్లో ఆ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.
భారీ అంచనాలున్న రాధేశ్యామ్ షూటింగ్ను పూర్తి చేసుకున్న పూజా హెగ్డే మళ్లీ డిసెంబర్ రెండవ లేదా మూడవ వారంలో ఆ సినిమా యూనిట్ సభ్యులతో హైదరాబాద్లో జత కలవబోతుందట.జనవరి లేదా ఫిబ్రవరి వరకు పూర్తిగా రాధేశ్యామ్లోని తన పార్ట్ను పూర్తి చేయబోతున్నట్లుగా సన్నిహితుల వద్ద పూజా హెగ్డే చెప్పుకొచ్చింది.
గత ఏడాదిన్నర కాలంగా రాధేశ్యామ్ సినిమా కోసం పూజా హెగ్డే వర్క్ చేస్తోంది.మద్యలో కరోనా కారణంగా ఆరు ఏడు నెలల పాటు షూటింగ్ జరగలేదు.ఒక వేళ షూటింగ్ రెగ్యులర్గా జరిగి ఉంటే సినిమా ఇప్పటికే పూర్తి అయ్యేది.త్వరలోనే షూటింగ్ ను జరుపుకునేందుకు సిద్దం అవుతున్న మరో తెలుగు సినిమాలో కూడా పూజా హెగ్డే నటించబోతుంది.
ఆ సినిమాకు జనవరిలో డేట్లు ఇచ్చినట్లుగా పూజా సన్నిహితులు చెబుతున్నారు.మొత్తానికి రాధేశ్యామ్ షూటింగ్తో పాటు ఇతర సినిమాలతో బిజీ బిజీగా ఈ అమ్మడు గడిపేస్తుంది.