ప్రభాస్ హీరోగా రూపొందిన రాధే శ్యామ్ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా భారీ వసూళ్లను దక్కించుకోవడం ఖాయం అంటూ అంతా నమ్మకంతో ఉన్నారు.
పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా విడుదల కాబోతుంది.హిందీ మరియు సౌత్ ఇండియన్ భాషలకు వేరు వేరు నటీ నటులు మరియు పాటలు ఉండటం వల్ల ఈ సినిమా ను జనాలు చాలా ప్రత్యేకంగా చూడబోతున్నారు.
అన్ని వర్గాల ప్రేక్షకులను మరియు అభిమానులను ఆకట్టుకునే విధంగా ఈ సినిమా ఉంటుందనే నమ్మకంతో రాధా కృష్ణ ఉన్నాడు.యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందిన ఈ సినిమా కు రాధా కృష్ణ దర్శకత్వం వహించిన విషయం తెల్సిందే.
రికార్డు బ్రేకింగ్ వసూళ్లతో పాటు ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ డమ్ ను మరింత పటిష్టం చేసే విధంగా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు.రాధా కృష్ణ ఈ కథ తో ప్రభాస్ హీరోగా సినిమా చేయాలని ఏడు ఎనిమిది ఏళ్లుగా ఎదురు చూశాడు.
ఎట్టకేలకు సినిమా పూర్తి అయ్యి విడుదలకు సిద్దం అయ్యింది.
సంక్రాంతికి రాబోతున్న ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.తాజాగా పూజా హెగ్డే ఈ సినిమా డబ్బింగ్ ను పూర్తి చేసింది.సాదారణంగా అయితే తన తెలుగు సినిమా లకు డబ్బింగ్ తాను చెప్పుకోదు.
అయితే హిందీ వర్షన్ రాధే శ్యామ్ కోసం ఆమె డబ్బింగ్ చెప్పినట్లుగా తెలుస్తోంది.సౌత్ లో అన్ని భాషలతో పాటు హిందీలో కూడా విడుదల అవ్వబోతున్న ఈ సినిమా లో పూజా హెగ్డే ప్రేరణ అనే పాత్రలో నటించింది.
ప్రేరణ పాత్రకు తమిళం మరియు తెలుగు కు గాను చిన్మయి తన గాత్రం ఇస్తుందని తెలుస్తోంది.ఇక ప్రభాస్ డబ్బింగ్ ఎలా ఉంటుంది అనేది చూడాలి.
తెలుగు లో ఖచ్చితంగా ఆయనే డబ్బింగ్ చెప్తాడు.కాని ఇతర భాషల్లో ఆయన డబ్బింగ్ చెప్పడం అనుమానమే.