భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల్లో అవకాశాలను సంపాదించుకుంటూ ఇతర హీరోయిన్లకు పూజా హెగ్డే షాక్ ఇస్తున్నారు.తెలుగులో ప్రస్తుతం పూజా హెగ్డే చేతిలో కొత్త సినిమాలేవీ లేకపోయినా పూజా హెగ్డే నటించిన మూడు సినిమాలు ఈ ఏడాది రిలీజ్ కానున్నాయి.
పూజా హెగ్డే తెలుగులో మళ్లీ వరుస ఆఫర్లతో బిజీ అవుతారని ఆమె ఫ్యాన్స్ భావిస్తున్నారు.అయితే కరోనా సెకండ్ వేవ్ వల్ల ఏర్పడిన పరిస్థితులపై పూజా హెగ్డే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా ముందు, కరోనా తర్వాత అని మాట్లాడే పరిస్థితి ఏర్పడింది.రోడ్లపై ఇష్టానుసారం తిరగలేని పరిస్థితి నెలకొంది.ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటే మాత్రమే ప్రస్తుత పరిస్థితుల్లో షూటింగ్ లను పూర్తి చేయడం సాధ్యమవుతుంది.సెట్ లో ఒక్కరికి కరోనా సోకినా షూటింగ్ పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి.
ఇష్టం ఉన్నా లేకపోయినా మాస్క్ తప్పనిసరిగా ధరించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ పరిస్థితుల గురించి పూజా హెగ్డే మాట్లాడుతూ కరోనా వల్ల ఒకప్పటిలా తిరగలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇన్ స్టాగ్రామ్ లో విహారయాత్రకు వెళ్లిన సమయంలో దిగిన ఒక ఫోటోను పూజా హెగ్డే షేర్ చేశారు.ఆ తరువాత మాస్క్ లేకుండా స్వేచ్చగా తిరిగే రోజులు ఎప్పుడొస్తాయో అంటూ రాశారు.
మరో 100 రోజుల పాటు కరోనా సెకండ్ వేవ్ ప్రభావం కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.
ప్రస్తుతం హిందీలో సర్కస్ అనే సినిమాలో ఎక్కువగా నటిస్తున్నారు.ఈ సినిమాతో పాటు తమిళంలో విజయ్ హీరోగా నటిస్తున్న ఒక సినిమాలో పూజా హెగ్డే నటిస్తున్నారు.తెలుగులో పూజా హెగ్డే నటిస్తున్న సినిమాలు హిట్టైతే మాత్రం ఆమె టాలీవుడ్ లో నంబర్ 1 హీరోయిన్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి.