యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఇప్పటికే మెజారిటీ షూటింగ్ను పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు ప్రభాస్ రెడీ అవుతున్నాడు.
కాగా ఈ సినిమాలో అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.పూర్తి రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీగా ఈ సినిమా వస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
ఇక ఈ సినిమాలో తన పాత్ర చాలా అద్భుతంగా ఉండబోతున్నట్లు అందాల భామ పూజా హెగ్డే చెప్పుకొచ్చింది.తాజాగా తన అభిమానులతో చిట్చాట్ చేసిన ఈ బ్యూటీ, రాధేశ్యామ్ చిత్రం గురించి, హీరో ప్రభాస్ గురించి కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది.
రాధేశ్యామ్ చిత్రం తన కెరీర్లో మరిచిపోలేని చిత్రంగా నిలవనుందని ఆమె చెప్పుకొచ్చింది.కాగా ప్రభాస్ తాను అనుకున్నంత సైలెంట్ కాదని, సెట్స్లో ఆయన చాలా యాక్టివ్గా ఉంటాడని పూజా చెప్పుకొచ్చింది.
అయితే ప్రభాస్ చాలా సిగ్గుపడతాడని తాను అనుకున్నట్లు పూజా చెప్పుకొచ్చింది.కానీ ప్రభాస్, ఒక్కసారి ఎవరికైనా దగ్గరయితే వారితో చాలా కలిసిమెలిసి పోతాడని ఆమె అంటోంది.
మొత్తానికి ప్రభాస్ గురించి ఆసక్తికరమైన విషయాలను పూజా హెగ్డే తెలపడంతో ఆయన ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.కాగా ఈ జోడీ వెండితెరపై ఎలాంటి కెమిస్ట్రీని పండిస్తారో చూడాలి అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.
ఇక రాధేశ్యామ్ చిత్రంతో పాటు అక్కినేని యంగ్ హీరో అఖిల్ సరసన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ చిత్రంలో కూడా అమ్మడు నటిస్తుండటంతో ప్రస్తుతం ఆమె బ్యాక్ టు బ్యాక్ విజయాలను అందుకోవాలని చూస్తోంది.మరి ఈ రెండు చిత్రాలు అమ్మడికి ఎలాంటి విజయాన్ని అందిస్తాయో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.