బుట్టబొమ్మగా తెలుగు ప్రేక్షకులని తన అందంతో మెస్మరైజ్ చేసిన అందాల భామ పూజా హెగ్డే.ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ క్రేజీయస్ట్ హీరోయిన్ గా ఉన్న పూజాహెగ్డేతో స్టార్ హీరోలు అందరూ జత కట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
వరుస హిట్ తో టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వైపు ఈ పొడుగుకాళ్ల సుందరి అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయింది.తెలుగులో పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ సినిమాలు మాత్రమే ఈ అమ్మడు ప్రస్తుతం చేస్తుంది.
ఈ రెండు వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాయి.ఇక ఈ సినిమాల తర్వాత తెలుగులో సినిమాలు తగ్గించి బాలీవుడ్ సినిమాల మీద ఫోకస్ పెట్టింది.
ఇప్పటికే హిందీలో సల్మాన్ ఖాన్ తో ఒక మూవీ, అలాగే రణవీర్ సింగ్ తో మరో మూవీ సైన్ చేసింది.ఇక రణవీర్ సింగ్ రోహిత్ శెట్టి దర్శకత్వంలో సర్కస్ సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్ళాల్సి ఉంది.ఇందులో హీరోయిన్ గా పూజా హెగ్డే ఖరారైంది.
అయితే ఈ సినిమా షెడ్యుల్ ని స్టార్ట్ చేయాలని అనుకున్న టీంకి పూజా హెగ్డే రిక్వస్ట్ చేయడంతో వాయిదా వేసినట్లు తెలుస్తుంది.
ప్రస్తుతం ఈ అమ్మడు రాధేశ్యామ్ షూటింగ్ చివరి షెడ్యూల్ కంప్లీట్ చేస్తుంది.
ఈ షెడ్యూల్ పూర్తి కావడానికి మరికొంత సమయం పడుతుంది.అయితే ఇంతలో ఆమె సర్కస్ షూటింగ్ లో కూడా పాల్గొనాల్సి ఉంది.
అయితే చిత్ర యూనిట్ ని ఆమె తన షెడ్యూల్ పోస్ట్ పోన్ చేయాలని అభ్యర్దిన్చిందని తెలుస్తుంది.ఇక ఆమె అభ్యర్ధనని ఒప్పుకున్న దర్శకుడు రాధేశ్యామ్ షూటింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు వేచి చూసేందుకు ఒప్పుకున్నారు.
మొత్తానికి పూజా హెగ్డే కోసం స్టార్ హీరో, స్టార్ దర్శకుడు సినిమా వాయిదా వేసారని తెలియడంతో బాలీవుడ్ ఈ టాపిక్ చర్చనీయాంశంగా మారిపోయింది.