అందాల భామ పూజా హెగ్డే ప్రస్తుతం టాలీవుడ్లో వరుస సినిమాలతో దూసుకుపోతుంది.అమ్మడు ఒకప్పుడు ఐరన్ లెగ్ పేరు తెచ్చుకుని, అటుపై డీజీ సినిమాతో గోల్డెన్ బ్యూటీగా మారింది.
ఆ తరువాత వరుసబెట్టి సక్సెస్లు అందుకున్న ఈ బ్యూటీ తాజాగా అల వైకుంఠపురములో సినిమాతో సక్సెస్ను అందుకుంది.కాగా బ్యూటీ అటు బాలీవుడ్లోనూ తన సత్తా చాటుతోంది.
అయితే గతంలో ఆమె ఓ యాడ్లో నటించినప్పుడు బాలీవుడ్ హీరో రణ్బీర్ కపూర్కు పలుసార్లు క్షమాపణ చెప్పినట్లు అమ్మడు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.ఆమె గతంలో రణ్బీర్తో కలిసి ఓ యాడ్ చేసినప్పుడు ఆయనని చూస్తు భయంతో డైలాగులు మర్చిపోయానని, దీంతో పలుసార్లు టేకింగ్ చేయాల్సి వచ్చిందని, దీంతో రణ్బీర్కు ఆమె చాలాసార్లు క్షమాపణ చెప్పిందట.
కాగా రణ్బీర్ మాత్రం ఆమెను అస్తమానం క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని చెప్పాడట.తనకు రణ్బీర్ చేసిన సహాయాన్ని తన జీవితంలో మర్చిపోలేని, ఆయన కొత్తవారికి చాలా ధైర్యం చేప్తాడని పూజా ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది.
కాగా ప్రస్తుతం పూజా హెగ్డే తెలుగులో ప్రభాస్ సరసన జాన్ సినిమాతో పాటు, అక్కినేని అఖిల్తో రొమాన్స్కు రెడీ అయ్యింది.