స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నా పేరు సూర్య సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకొని, కచ్చితంగా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు.దీని కోసం చాలా మంది దర్శకులు కథలు విన్న కూడా చివరికి త్రివిక్రమ్ తో సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళడానికి రెడీ అయ్యాడు.
ఇక తాజాగా తన పుట్టినరోజు సందర్భంగా అల్లు అర్జున్ ఏకంగా మూడు సినిమాలు చేయబోతున్నట్లు ఎనౌన్స్ మెంట్ చేసాడు.వాటిలో అధికారికంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నాడు.
ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకేక్కబోయే ఈ సినిమా ఈనెల 25న ప్రారంభించాబోతున్నట్లు తెలుస్తుంది.ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ఇప్పటికే పూజా హెగ్డేని దర్శకుడు ఫైనల్ చేసేసాడు.
ఇదిలా ఉంటే మరో వైపు సుకుమార్ దర్శకత్వంలో కూడా సినిమాని బన్ని సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నాడు.ఈ సినిమా ఆగష్టులో ఆరంభ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
అలాగే వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు ప్రొడక్షన్ లో ఓ మూవీ సెట్స్ పైకి వెళ్ళబోతుంది.ఇదిలా ఉంటే సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో క్రేజీ హీరోయిన్ రష్మిక మంధన హీరోయిన్ గా ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది.
మొత్తానికి బన్నీ ఒకేసారి ప్రస్తుతం క్రేజీ హీరోయిన్స్ గా ఉన్న పూజా హెగ్డే, రష్మికతో జత కట్టడం విశేషం.