మాస్టర్ సినిమాతో లాక్ డౌన్ తర్వాత కోలీవుడ్ నుంచి సాలిడ్ హిట్ కొట్టిన ఇళయదళపతి విజయ్ ప్రస్తుతం నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో నెక్స్ట్ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.ప్రస్తుతం ఈ సినిమా ప్రీప్రొడక్షన్ దశలో ఉంది.
యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని దర్శకుడు తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడు.భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నారు.
ఇప్పటికే తెలుగులో కూడా విజయ్ తనకంటూ కొంత మార్కెట్ ఏర్పరుచుకున్నారు.ఇప్పుడు బాలీవుడ్ లో కూడా అదే తరహాలో తన మార్కెట్ రేంజ్ పెంచుకోవాలని అనుకుంటున్నాడు.
కోలీవుడ్ హీరోలైన విక్రమ్, సూర్య, కమల్ హాసన్, రజినీకాంత్ లకి బాలీవుడ్ లో కూడా మార్కెట్ ఉంది.ఇక తన మార్కెట్ పరిధిని విస్తరించుకోవడానికి విజయ్ తన కొత్త సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేస్తున్నాడు.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ కోసం ఇప్పుడు దర్శకుడు వేట మొదలుపెట్టాడు.ప్రస్తుతం సౌత్, నార్త్ లో క్రేజీయస్ట్ హీరోయిన్స్ గా ఉన్న అందాల భామలు రష్మిక మందన, పూజా హెగ్డే, కియారా అద్వానీ.
ఈ ముగ్గురు భామలతో ఒకరిని హీరోయిన్ గా ఫైనల్ చేయాలని అనుకుంటున్నారు.ఈ కాంపిటేషన్ లో ఎక్కువగా పూజా హెగ్డే, రష్మిక మందన పేర్లు వినిపిస్తున్నాయి.వీరిలో ఒకరిని కన్ఫర్మ్ చేసే అవకాశం ఉందని టాక్ బలంగా వినిపిస్తుంది.పూజా హెగ్డే, రష్మికలలో ఎవరికీ ఈ సినిమా ఆఫర్ వచ్చిన కోలీవుడ్ అది వాళ్ళకి పెద్ద ఆఫర్ అవుతుంది అనడంలో అతిశయోక్తి కాదు.
మరి వీరిలో విజయ్ తో జతకట్టే అవకాశాన్ని ఏ అందాల భామ సొంతం చేసుకుంటుంది అనేది చూడాలి.