టాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు దక్షిణాది చిత్ర పరిశ్రమలో పూజాహెగ్డే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది ఇక ప్రస్తుతం ఏదైనా పెద్ద ప్రాజెక్ట్ తెరమీదికి వచ్చిందంటే చాలు అందులో హీరోయిన్ గా మొదటి ఆప్షన్ పూజాహెగ్డే నే.ఇక ఈ అమ్మడిని సినిమాల్లో పెట్టుకుంటే హిట్టు కొట్టడం పక్క అని ప్రస్తుతం ఎంతో మంది నమ్ముతున్నారు.
ఇక పట్టుకున్నదల్లా బంగారం అయినట్లు ఈ అమ్మడు చేసిన ప్రతి సినిమా కూడా సూపర్ హిట్ అవుతుంది.తెలుగు తమిళ సినిమాలలో మాత్రమే కాకుండా బాలీవుడ్ లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది ఈ హాట్ బ్యూటీ.
ఇక ఈ అమ్మడు భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నప్పటికీ దర్శక నిర్మాతలు మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గకుండా తమ సినిమాల్లో పూజా హెగ్డే కావాలని పట్టుబడుతున్నారు.అయితే పూజా హెగ్డే కెరీర్ పై టర్నింగ్ పాయింట్ గా నిలిచిన సినిమా ఏది అంటే అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అలా వైకుంఠపురం లో సినిమా అని చెప్పాలి.
అంతకు ముందు కూడా ఈ అమ్మడి ఖాతాలో మంచి విజయాలు ఉన్నప్పటికీ అలా వైకుంఠపురముతో మాత్రం బుట్ట బొమ్మ అనే ఇమేజ్ సంపాదించుకుని ఎంతో మందిని ఆకర్షించింది.అయితే ఇటీవలే త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన అలా వైకుంఠపురం లో సూపర్ హిట్ మూవీ విడుదలై రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మరోసారి పూజా హెగ్డే సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారిపోయింది.
దీంతో ఇక బన్నీ అభిమానులు అందరూ అలా వైకుంఠపురములో సినిమా పోస్టర్ లను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.అంతే కాదండోయ్ తన అందం అభినయంతో ఈ సినిమాలో ఆకట్టుకున్న బుట్ట బొమ్మ పూజా హెగ్డే ఫోటోలను కూడా షేర్ చేస్తూ ఉండటం గమనార్హం.
ఈ క్రమంలోనే ఇక తన ఫోటోలు షేర్ చేయడం పై స్పందించిన పూజా హెగ్డే అభిమానులందరికీ థ్యాంక్స్ చెప్పినట్లు తెలుస్తోంది.అలా వైకుంఠపురం లో సినిమా విడుదలైన సమయంలో ఇక బన్నీ ఫాన్స్ చేసిన హంగామా కు సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.ఈ ముద్దుగుమ్మ.దీంతో మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారిపోయింది బుట్ట బొమ్మ.