తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పటి హీరోయిన్ భూమిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.నటించింది కొన్ని సినిమాలే అయినా ఎంతో మంచి క్రేజ్ సంపాదించుకుంది.
ఇక పవన్ కళ్యాణ్ భూమిక జంటగా వచ్చిన “ఖుషి” సినిమా ఏ స్థాయిలో విజయం సాధించిందో చెప్పాల్సిన పని లేదు.ఇప్పటికీ ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు ప్రేక్షకుల మదిలో నిలిచి పోయాయి.
ఈ విధంగా భూమిక ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించారు.ఈక్రమంలోనే పవన్ కళ్యాణ్ ఏడవ సినిమాగా “ఖుషి” సినిమాలో నటించగా మహేష్ బాబు ఏడవ సినిమాగా “ఒక్కడు”, ఎన్టీఆర్ ఏడవ సినిమాగా “సింహాద్రి” సినిమాలో భూమిక నటించింది.
అయితే ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకొని భూమికకు స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సంపాదించిపెట్టాయి.అయితే ప్రస్తుతం భూమిక సొంతం చేసుకున్న ఈ రికార్డులను త్వరలోనే బుట్టబొమ్మ పూజా హెగ్డే దక్కించుకో బోతున్నట్లు తెలుస్తోంది.
ఒక లైలా కోసం అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ బుట్ట బొమ్మ ఆ తర్వాత వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంటూ ప్రస్తుతం హీరోయిన్ గా కొనసాగుతోంది.
ఈ క్రమంలోనే పూజా హెగ్డే 2018 లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తన 28వ చిత్రం “అరవింద సమేత” సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించారు.ఈ సినిమా అప్పట్లో మంచి టాక్ సంపాదించుకుంది.అదేవిధంగా మహేష్ బాబు 28వ సినిమాలో హీరోయిన్ గా కూడా పూజా హెగ్డే కన్ ఫర్మ్ అయ్యారు.
ఇకపోతే పవన్ కళ్యాణ్ 28వ సినిమాలో హీరోయిన్ పూజా హెగ్డే ను తీసుకోవాలనే ఆలోచనలో చిత్రబృందం ఉన్నట్లు తెలుస్తోంది.ఇదే కనుక నిజమైతే అప్పట్లో భూమిక రికార్డును పూజా హెగ్డే అబద్ధాలు కొడుతుందని చెప్పవచ్చు.