లెజెండరీ దర్శకుడు మణిరత్నం ఆలోచనల నుంచి పాన్ ఇండియా రేంజ్ రేంజ్ లో భారీ మల్టీ స్టారర్ చిత్రంగా తెరకెక్కుతున్న సినిమా పొన్నియన్ సెల్వన్.చియాన్ విక్రం, జయం రవి, కార్తి, త్రిష, ఐశ్వర్య రాయ్, ఐశ్వర్య రాజేష్ లాంటి స్టార్స్ ఈ సినిమాలో నటిస్తున్నారు.
చోళుల కాలం నాటి కథాంశంతో ఈ సినిమాని సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరిస్తున్నారు.కోలీవుడ్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది.
ఇన్ని రోజులు చెన్నైలో ఈ సినిమా కోసం వేసిన ప్రత్యేకమైన కోట సెట్ లో షూటింగ్ జరిగింది.ఇదిలా ఉంటే తాజాగా గోదావరి తీరంలో పోలవరం పొన్నియన్ సెల్వన్ షూటింగ్ ని దర్శకుడు మణిరత్నం స్టార్ట్ చేశారు.
ఈ షూటింగ్ లో త్రిష కూడా పాల్గొంది.గోదావరిలో హంస తరహాలో ఉన్న పడవపై రొమాంటిక్ సన్నివేశాలు, పాటని చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తుంది.
తమిళ్ పాన్ ఇండియా మూవీ షూటింగ్ పోలవరంలో జరుగుతుందనే టాక్ బయటకి రావడంతో ఆ ప్రాంతం చుట్టుపక్కల జనం విపరీతంగా షూటింగ్ లొకేషన్ వద్దకి స్టార్ నటులని చూడటానికి తరలి వెళ్ళారు.త్వరలోనే విక్రమ్, ఐశ్వర్యారాయ్ కూడా షూటింగ్ లో జాయిన్ అవనున్నట్లు తెలుస్తోంది.
మణిరత్నం సొంత నిర్మాణ సంస్థ మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.ఇదిలా ఉంటే గోదావరి జిల్లాలోని మారేడుమల్లి ఫారెస్ట్ లో మెగాస్టార్ చిరంజీవి, కొరటాల కాంబినేషన్ లో ఆచార్య సినిమా షూటింగ్ కూడా మొదలు కాబోతుంది.
ఇక్కడ కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ ని చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తుంది.