తెలంగాణాలో మహాకూటమిలో ఉన్న పార్టీలకు సీట్ల సర్దుబాటు వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారిన సంగతి తెలిసిందే.ఇప్పటికే … వివాదం నెలకొన్న ప్రతి చోట నయానో .భయానో బుజ్జగిస్తూ వస్తున్నారు.అయితే… జనగామ స్థానం నుంచి కూటమి అభ్యర్థి విషయంలో కూడా ప్రతిష్టంభన ఏర్పడడంతో….హాట్ టాపిక్ గా మారింది.
ఈ నేపథ్యంలో పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు ఎట్టకేలకు లైన్ క్లియర్ అయింది.తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్ జనగామ బరిలో నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో చర్చల అనంతరం ఆయన ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
పొన్నాల లక్ష్మయ్యకు టికెట్ కన్ఫార్మ్ కావడంతో ఆయన అనుచరులు, కాంగ్రెస్ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.