పొన్నాల లక్ష్మయ్య కామెంట్స్… మోడీ కి 100 అంటే చాలా మక్కువ గా వున్నట్లుంది.మోడీ అధికారంలోకి వచ్చిన కొత్తలో 100 రోజుల్లో ఈ పని చేస్తా, ఆ పనిచేస్తా అన్నారు.
ఇంత వరకు చెయ్యాలే.దేశ జనాభాలో 80శాతం వున్న పేద ప్రజల కోసం ఏమైన చేసిండా.100 కోట్ల వ్యాక్సిన్ డోసులు వేశామని ప్రచారం చేస్తున్నారు.పెట్రో, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెంచుడెంది.
ఇతర దేశాల్లో టీకాలు సప్లయ్ కాకున్నా.వ్యాక్సిన్ పూర్తి చేశాయి.
మన వద్దే తయారయ్యే వ్యాక్సిన్లు.ఐనా ఇంకా పూర్తి స్థాయిలో టీకాలు ఎవ్వలేదు.
నూటికి నూరు శాతం 106 దేశాలు వ్యాక్సిన్ పూర్తి చేశాయి.
మోడీ అబద్ధాలు చెప్పడంలో దిట్టా.
కాంగ్రెస్ హయాంలో వీటికంటే ఎక్కువ చేశాం.ఫుడ్, హెల్త్ విషయంలో మలేరియా నిర్మూలనలో కాంగ్రెస్ పార్టీ చేసిన ఘనతే.
లఖిం పూర్ లో రైతులను చంపుతుంటే బయటికి ఎందుకు రావు.మోడీకి వంతపాడిన ఘనుడు కేసీఆర్.
పారా సిటమాల్, మాస్క్ అవసరం లేదన్నారు కేసీఆర్. అసలు కరోనా తెలంగాణలో రాదని చెప్పిండు ఏమైంది.ప్రజాద్రోహి కేసీఆర్. మోడీ కేసులు పెడతాడు అని భయపడుతున్నాడు.