నందమూరి, మెగా కుటుంబాల్లో రాజకీయాలు పెట్టిన చిచ్చు ఇప్పట్లో చల్లారేలా లేదు! ఒక్కటిగా ఉన్న కుటంబాలు రెండుగా చీలిపోయాయి! ఇప్పుడు ఘట్టమనేని కుటుంబంలోనూ ఇలాంటి చిచ్చు రేగబోతోందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది.తాజాగా జగన్ ప్రెస్మీట్లో ఘట్టమనేని ఆదిశేషగిరిరావు కనిపించడం ఇందుకు బలం చేకూరుస్తోంది.
రాజకీయాలకు దూరంగా ఉండే స్టార్ హీరోల్లో ప్రిన్స్ మహేశ్బాబు కూడా ఒకరు! ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించినపుడు.ఘట్టమనేని హీరో, నటశేఖర కృష్ణ కాంగ్రెస్లో చేరారు.
అయితే అనేక ఎదురుదెబ్బలు తిన్న తర్వాత కృష్ణ రాజకీయాలకు దూరంగా ఉన్నారు.అయితే ఆయన ఎంత దూరంగా ఉన్నా రాజకీయం మాత్రం ఆయన్ని వదిలిపెట్టడంలేదు.2014 ఎన్నికలకు కొద్దినెలల ముందు దాకా ఆయన అనుమతి లేకుండానే కాంగ్రెస్, వైసీపీ శ్రేణులు మహేశ్ ఫొటోను ఫ్లెక్సీల్లో ఉంచాయి, దీంతో ఇక మహేశ్.వైసీపీకి మద్దతిస్తారనే ప్రచారం జరిగింది.
అదే ఎన్నికల్లో మహేష్ బావ గల్లా జయదేవ్ కుటుంబం టీడీపీ లో చేరడం,గుంటూరు నుంచి ఎంపీ గా పోటీ చేయడంతో ప్రిన్స్ తన బావకు మద్దతు ఇవ్వక తప్పలేదు.తండ్రి కృష్ణ సహజంగా వై.ఎస్ కుటుంబానికి దగ్గరగా మెసిలినవాడు కావడం అందరికీ తెలిసిందే.అందుకు భిన్నమైన నేపధ్యం ఉన్న టీడీపీ లో బావ జయదేవ్ చేరడం కాస్త ఇబ్బంది అయినా మహేష్ దాన్ని మేనేజ్ చేస్తున్నాడు.
అయితే కృష్ణా,గుంటూరు జిల్లాల్లో బలమైన కమ్మ నేతల అవసరాన్ని గుర్తించిన వైసీపీ అధినేత జగన్ …కృష్ణ సోదరుడు,మహేష్ బాబాయ్ అయిన ఆదిశేష గిరి రావు ని పార్టీ లో బాగా యాక్టివ్ చేస్తున్నారు.ఆయన ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నా ఇటీవల ఆయన ప్రాధాన్యం పెరిగింది.
పెద్ద పెద్ద నాయకులు ఉన్నప్పటికీ తాజాగా జగన్ ప్రెస్ మీట్ లో ఆదిశేషగిరిరావు ని పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడారు.దీంతో ఘట్టమనేని కుటుంబ అభిమానులు సంకటంలో పడుతున్నారు.
ప్రిన్స్ మహేష్ కూడా ఈ వ్యవహారంతో ఇబ్బంది పడుతున్నారని సమాచారం.