నంద్యాల జిల్లాలో రాజకీయ వేడి రాజుకుంది.వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రారెడ్డి, మాజీమంత్రి భూమా అఖిలప్రియ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.
భూమా అఖిలప్రియపై శిల్పా రవి మరోసారి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తండ్రి ఆస్తులు కావాలన్నప్పుడు అప్పులు కూడా తీసుకోవాలని శిల్పా రవి అన్నారు.
తన తండ్రికి మచ్చ రాకుండా అఖిలప్రియ చూసుకోవాలన్నారు.అరాచకాలు చేస్తూ ఫ్యాక్షనిస్ట్ అని చెప్పుకుంటున్నారని విమర్శించారు.
అయితే శిల్పా రవికి భూమా బహిరంగ చర్చకు రావాలంటూ సవాల్ విసిరిన విషయం తెలిసిందే.