రాజకీయాల్లో అధికారాన్ని కాపాడుకోవడానికి ఆయా పార్టీలు వేసే ఎత్తులకు అర్ధం చేసుకోని వారికైతే పిచ్చెక్కిపోతుంది.అప్పటి వరకు ఒక పార్టీని తిట్టిన ప్రతిపక్ష నేతలు కూడా తిట్టిన పార్టీ అధికారంలోకి రాగానే అందులోకి దారి కడతారు. అప్పటి వరకు విమర్శించిన నోటితోనే ఆ పార్టీని పొగుడుతారు.రాజకీయం అంటేనే ఓ రంగుల రాట్నం.అర్ధం కానీ బురద కూపం అని అందుకే అంటారు పెద్దలు.ఇకపోతే పశ్చిమబెంగాల్లో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల వేడి మరింత రాజుకుందట.
ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతాబెనర్జిని బీజేపీ గట్టిగానే టార్గెట్ చేసినట్లు కనబడుతుందని అనుకుంటున్నారట.
కాగా అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది.
ఇదిలా ఉండగా బెంగాల్లో పోటాపోటీగా ప్రచారం చేస్తున్నా బీజేపీలోకి టీఎంసీ నుంచి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి.టీఎంసీలో మాత్రం బయటికి వెళ్లేవారే తప్ప వచ్చేవారెవరూ కనిపించడం లేదట.
అంతేగాక బీజేపీలోకి టీఎంసీ నుండి కాకుండా సినీరంగం నుంచి కూడా జోరుగా చేరికలు సాగుతున్నాయి.
ఇటీవల మిథున్ చక్రవర్తి పార్టీలో చేరగా ఇప్పుడుర్ నటుడు యువనటి రాజ్శ్రీ రాజ్బన్షీ, సీనియ బొన్ని సేన్ గుప్తా కూడా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
ఇక ప్రచారంలో కూడా టీఎంసీ కంటే బీజేపీ ముందు వరసలో ఉంది.మరి ఈ రాజకీయ చదరంగంలో రానున్న రోజుల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయా లేదా అన్నది చూడాలి.