టీమిండియా క్రికెటర్‌కు షాకిచ్చిన పోలీసులు.. ?

ప్రస్తుతం ప్రజలు కంటికి కనిపించని కరోనాతో యుద్ధం చేస్తున్న విషయం తెలిసిందే.ఇప్పుడున్న పరిస్దితుల్లో బయటకు వెళ్లాలంటే కట్టుదిట్టమైన రక్షణ చర్యలు అవసరం.

 Police Shocked Team India Cricketer, Maharashtra, Sindhudurg District, Police St-TeluguStop.com

అంతే కాదు ఎంతో అవసరం అయితేనే తప్ప బయటకు వెళ్ళకండని ప్రభుత్వాలు కూడా ఆదేశాలు ఇచ్చాయి.

ఇక ఏదైనా అత్యవసరం ఉండి బయటకు వెళ్లవలసి వస్తే, లేదా దూర ప్రయాణాలు చేయవలసి వస్తే ఈ-పాస్ లు తప్పనిసరిగా కలిగి ఉండాలని పోలీసులు చెబుతున్నారు.

ఇక కరోనా మహమ్మారి దేశంలో స్వైరవిహారం చేస్తున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు ఇలాంటి కఠిన ప్రయాణ ఆంక్షలు విధించడం తెలిసిందే.

ఇంతటి క్లిష్ట పరిస్దితుల్లో టీమిండియా యువ క్రికెటర్ ఎలాంటి ఈ-పాస్ లేకుండా గోవా వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు షాకిచ్చారు.

ముంబయి నుంచి గోవా వెళుతున్న పృథ్వీ షాను పోలీసులు మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలో ఆపివేయగా ఇతను సత్వరమే ఈ-పాస్ టోకెన్ పొందడంతో అనుమతి ఇచ్చారట.అయినా ఇంతటి పరిస్దితుల్లో బయటకు వెళ్లకుంటే జరిగే నష్టం ఏమని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube