ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు పోలీసులు షాక్ ఇచ్చారు.ఈ క్రమంలో అభ్యర్థులపై మొత్తం 38 కేసులు నమోదు చేశారు.
తెలంగాణ అసెంబ్లీ వద్ద నిన్న ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే.రన్నింగ్ క్వాలిఫై అయిన వారిని మెయిన్స్ కు అనుమతించాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఈ నేపథ్యంలో ఆందోళన చేస్తున్న ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులను అడ్డుకున్న పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.అనంతరం అభ్యర్థులపై 353తో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేశారు.