స్త్రీకి సమాజంలో చాలా గౌరవం ఉంటుంది.ముఖ్యంగా పిల్లలకు తల్లిగా ఒక మహిళ చాలా ఉన్నతంగా వ్యవహరించాల్సి ఉంటుంది.
తమ పిల్లలు సమాజంలో ఉన్నత వ్యక్తులుగా గుర్తింపు పొందాలి అంటే ఆమె ఖచ్చితంగా ఉన్నత విలువలతో వారిని పెంచాలి.పిల్లల పెంపకం విషయంలో తండ్రుల పాత్ర కంటే తల్లుల పాత్ర చాలా ఎక్కువ అంటూ నిపుణులు పదే పదే చెబుతూ ఉంటారు.
అయినా కూడా కొందరు నీచమైన తలులు వారి నీచాతి నీచమైన కోర్కెల కోసం పిల్లల జీవితాలతో చెలగాటాలు ఆడుతూ చివరకు ప్రాణాలు తీయడం కూడా చూస్తూ ఉంటాం.అక్రమ సంబంధం కోసం పిల్లలు అడ్డుగా ఉన్నారని చంపేసిన తల్లులు చాలా మంది ఉంటారు.
అయితే ఒక పోలీస్ ఆఫీసర్ ఇలా చేయడం చర్చనీయాంశం అయ్యింది.
అమెరికాలో మిస్సిసిపీలో కేసీ బార్కర్ అనే 29 ఏళ్ల లేడీ పోలీస్ ఆఫీసర్ విధులు నిర్వర్తిస్తూ ఉంది.
ఆమె బీచ్ మరియు చుట్టు పక్కల ప్రాంతాల్లో పెట్రోలింగ్ నిర్వర్తిస్తూ ఉండాలి.పెట్రోలింగ్ నిర్వరించే సమయంలో తన పక్కన తన చిన్నారి కూతురును వెంట తీసుకు వెళ్లింది.
తన కూతురును పక్కన పెట్టుకుని కొద్ది సమయం బార్కర్ పెట్రోలింగ్ నిర్వహించింది.ఆ తర్వాత రాత్రి 11 గంటల సమయంలో తన ఉన్నతాధికారి ఇంటి వైపుకు వెళ్లింది.
అప్పటికే పడుకుని ఉన్న పాపను కారులోనే వదిలేసి అతడి వద్దకు వెళ్లింది.చాలా కాలంగా బార్కర్కు అతడితో సంబంధం ఉంది.రాత్రి 11 గంటలకు అతడి వద్దకు వెళ్లిన బార్కర్ శృంగారంలో మునిగి పోయింది.శృంగారం తర్వాత బాగా అలసి పోయిన బార్కర్ అక్కడే పడుకుండి పోయింది.తెల్ల వారు జామున నాలుగు గంటల సమయంలో ఆమె లేచి బయటకు వచ్చింది.అయితే కారులో ఏసీ పని చేయక పోవడంతో వేడి ఉక్కపోత, గాలి ఆడక ఆ చిన్నారి మృతి చెందింది.
తన పాప మృతి విషయాన్ని ఆమె దాచాలని ప్రయత్నించింది.మూడు సంవత్సరాల పాటు పాప మరణంను సహజ మరణంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది.
అయితే తాజాగా కోర్టు విచారణలో విషయం బయటకు వెళ్లడించింది.దాంతో ఆమెను విధుల నుండి తొలగిస్తూ కేసు నమోదు చేయడం జరిగింది.
బార్కర్ గతంలో కూడా ఒకసారి పాపను కారులో వదిలేసి ప్రియుడి వద్దకు వెళ్లింది.ఆ సమయంలో కొందరు గమనించడం వల్ల పాపను కాపాడారు.అప్పుడు వారం రోజుల పాటు ఆమెను సస్పెండ్ చేయడం జరిగింది.ఇలాంటి నీచమైన తల్లిని ఏం చేసినా తప్పు లేదని అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.