టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ చేసిన ఒక తప్పు వల్ల ఆమె అరెస్ట్ ఖాయమని తెలుస్తోంది.నిన్న ఎన్సీబీ అధికారుల విచారణలో తాను డ్రగ్స్ తీసుకోలేదని.
ఇంట్లో డ్రగ్స్ దాచడం మాత్రం వాస్తవమేనని రకుల్ తెలిపింది.అయితే న్యాయ నిపుణులు డ్రగ్స్ తీసుకోవడం కంటే డ్రగ్స్ దాచడం పెద్ద నేరమని చెబుతున్నారు.
ఆమె విచారణలో డ్రగ్స్ దాచినట్టు చెప్పి ఉంటే అరెస్ట్ కాక తప్పదని పేర్కొంటున్నారు.
ఎన్డీపీఎస్ చట్టం 8(సి) చట్టం ప్రకారం రకుల్ ను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి.
రకుల్ ఇచ్చిన స్టేట్ మెంట్ ను పూర్తిస్థాయిలో పరిశీలించి ఆమె అరెస్ట్ విషయంలో అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు.రకుల్ డ్రగ్స్ చాట్ చేసినట్లు అంగీకరించగా మరో హీరోయిన్ దీపికా పదుకొనే సైతం డ్రగ్స్ చాట్ చేసినట్టు ఒప్పుకుంది.
రకుల్ డ్రగ్స్ కేసుకు సంబంధించి నలుగురి పేర్లను వెల్లడించిందని త్వరలో సమన్లు జారీ చేసి వారిని కూడా అధికారులు విచారించనున్నారని సమాచారం. మరోవైపు ధర్మ ప్రొడక్షన్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ క్షితిజ్ రవి ప్రసాద్ ను ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
ప్రముఖ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్ కంపెనీకి చెందిన రవి అరెస్ట్ కావడంతో కరణ్ కు కూడా ఈ కేసుతో సంబంధం ఉందా.? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.అయితే ఈ కేసుతో సంబంధం ఉన్న సినీ ప్రముఖులందరూ పడుతున్న టెన్షన్ అంతాఇంతా కాదని తెలుస్తోంది.
ఈ కేసులో మరికొన్ని పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం.
మరోవైపు హీరోయిన్ల పేర్లు వెలుగులోకి రావడంతో ఇప్పటికే ఈ హీరోయిన్లకు సినిమాల కోసం అడ్వాన్సులిచ్చిన నిర్మాతలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని తెలుస్తోంది.ఈ డ్రగ్స్ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాల్సి ఉంది.