జేఈఈ మెయన్స్ స్మార్ట్ కాపీయింగ్పై హైదరాబాద్ పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.స్మార్ట్ ఫోన్స్ రావడంలో ఎవరి వైఫల్యం ఉందనే కోణంలో విచారణ చేస్తున్నారు.
ఇప్పటికే ఈ వ్యవహారంలో కీలక సూత్రధారిగా ఉన్న చైతన్య కృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.ఐదుగురి దగ్గర స్మార్ట్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
విద్యార్థులపై ఐపీసీ 188, 420 సెక్షన్లతో పాటు తెలంగాణ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్ లోని 4(బీ), 8 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.పరీక్షా కేంద్రంలో ఉన్న ఇన్విజిలేటర్లు, అబ్జర్వర్లకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది.
మిగిలిన నలుగురు విద్యార్థులకు పోలీసులు నోటీసులు ఇచ్చారు.