అనంతపురం జిల్లా ధర్మవరం లో టిడిపి నేత పరిటాల శ్రీరామ్ నీ పోలీసులు అడ్డుకోవడం జరిగింది.పెన్షన్లను నిలిపివేయటం నిరసిస్తూ టీడీపీ చేపట్టిన ఆందోళనలు నిరసనల కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడం జరిగింది.
నిరసన కార్యక్రమాలకు అనుమతి లేదంటూ పరిటాల శ్రీరామ్ ని రాఘవేంద్ర స్వామి ఆలయం నుండి బయటకు రానివ్వకుండా పోలీసులు అడ్డుకోవడం జరిగింది.ఈ క్రమంలో లో తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు భారీగా రావడంతో పోలీసులకు కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకున్న తరుణంలో పోలీసులనీ ప్రతిఘటిస్తూ పరిటాల శ్రీరామ్ ముందుకు కదలడంతో ఆయనను పెట్రోల్ బంకు వద్ద పోలీసులు ఆపేశారు.
ఈ పరిణామంతో అనంతపురం జిల్లా ధర్మవరంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రభుత్వం పింఛన్లు తొలగించే కార్యక్రమాన్ని నిరసిస్తూ ఆర్డిఓ కార్యాలయం ముందు.పరిటాల శ్రీరామ్ ధర్నాకు పిలుపునివ్వడం జరిగింది.ఈ క్రమంలో కార్యకర్తలు భారీగా రావడంతో పోలీసులు వారిని ఎక్కడికక్కడ అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితుల మధ్య మాజీ మంత్రి పరిటాల సునీత తోపాటు ధర్మవరం ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ మిగతా టిడిపి నాయకులు ర్యాలీగా.
బయలుదేరాగా పోలీసులు వారిని అడ్డుకున్నారు.ఇటువంటి పరిస్థితుల్లో పోలీసుల తీరుపై పరిటాల సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు.