ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ కుటుంబం పై మరో కేసు పోలీసులు నమోదు చేయడం జరిగింది.గతంలో ఒక కిడ్నాప్ కేసులో.
భూమా అఖిలప్రియ ఆమె సోదరుడు జగత్ విక్యత్ అదే రీతిలో ఆమె భర్త భార్గవ్ రామ్ పై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.ఇదిలా ఉంటే కిడ్నాప్ కేస్ లో.కోర్టును తప్పుదోవ పట్టించే రీతిలో కరోనా నకిలీ సర్టిఫికెట్లు.భూమా అఖిలప్రియ.
భర్త భార్గవ్ రామ్, సోదరుడు జగత్ విక్యాత్ సృష్టించడంతో.పోలీసుల విచారణలో అసలు విషయం బయట పడటంతో.
బావ బామ్మర్దుల పై అదేరీతిలో నకిలీ సర్టిఫికెట్లు అందించిన హాస్పిటల్ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది.
మొదటి కేసులోనే ఈ బావ బామ్మర్ది ఇద్దరు పోలీసులకు చిక్కకుండా కొంతకాలం పారిపోయి ఆ తర్వాత బెయిల్ పై బయటకు వచ్చారు.మరి ఇప్పుడు న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించే రీతిలో విచారణకు హాజరు కాకుండా అఖిల ప్రియ భర్త సోదరుడు వేసిన ఈ ఎత్తుగడ ఈ విషయంలో అధికారులు ఏ విధంగా చెక్ పెడతారు అన్నది సస్పెన్స్ గా నెలకొంది.