రోజురోజుకూ సమాజంలో దారుణాలు జరుగుతున్నాయి.చదువుకుని మంచి పొజిషన్ లో ఉన్న అధికారులు కూడా తప్పుల మీద తప్పులు చేస్తూ సమాజంలో దోషులుగా నిలబడుతున్నారు.
అధికారిగా ప్రజలకు చెప్పాల్సిన వారే చెడు మార్గంలో నడుస్తున్నారు.తప్పు చేసిన ప్రజలను మంచి దారిలో నడిచేలా చేయాల్సిన పోలీస్ ఆఫీసర్ నే తప్పు దారిలో నడుస్తూ అడ్డంగా దొరికి పోయిన ఒక కానిస్టేబుల్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
అతడొక పోలీస్ కానిస్టేబుల్.అతడు విశాఖపట్నం లోని సి సి ఆర్ బి లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు.ఆ కానిస్టేబుల్ పేరు అప్పలరాజు.ఇతడు ఇప్పటికే నలుగురిని పెళ్లి చేసుకున్నాడు.
ఇక ఇప్పుడు ఐదవ పెళ్ళికి కూడా సిద్ధం అవుతున్నాడు.ఆ నలుగురి మహిళలను ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకున్నాడు ఈ ప్రబుద్ధుడు.
ఈ నలుగురి భార్యలకు ఐదుగురు పిల్లలు కూడా ఉన్నారు ఇక ఇప్పుడు ఐదవ పెళ్ళికి సిద్ధం అయ్యాడు.ఈ విషయం అతడి భార్యలలో ఒకరికి తెలిసింది.అప్పలరాజు మహిళ కానిస్టేబుల్ తో ఐదవ పెళ్లి చేసుకునేందుకు రెడీ అయ్యాడని అతడి భార్యల్లో ఒకరైన పద్మ అనే భార్యకు తెలిసింది.పద్మ ఈ విషయంపై అప్పలరాజును నిలదీసింది.
ఆ తర్వాత దిశా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో అతడి గుట్టు బయట పడింది.పోలీసులు అతడిపై విచారణ చేయగా అతడు ఆమెనే కాదు మరొక ముగ్గురిని కూడా వివాహం చేసుకున్నాడని తెలిసింది.
దీంతో ఆ భార్యలు అప్పలరాజును పోలీసులకు అప్పగించారు.అతడి ఉద్యోగం కూడా తీసేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఇక ఆ కానిస్టేబుల్ చేతిలో మోసపోయిన ఆ మహిళలకు చేతన స్వచ్చంద సంస్థ అండగా ఉంటామని తెలిపారు.