బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు అందింది.తెలంగాణ గవర్నర్ తమిళిసైను అగౌరవ పరిచేలా అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు చర్యలు తీసుకోవాలని సరూర్ నగర్ కార్పొరేటర్ ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
మహిళా గవర్నర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలు సరికాదన్నారు.కౌశిక్ రెడ్డి వంటి మూర్ఖుడు ప్రజా ప్రతినిధిగా ఉండటానికి వీలు లేదన్నారు.
ఈ మేరకు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని కార్పోరేటర్ డిమాండ్ చేశారని తెలుస్తోంది.