నగరంలో కరోనా కేసుల విజృంభన ఇంకా కొనసాగుతున్న నేపధ్యంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ప్రజలకు కీలక సూచనలు చేశారు.దేశంలో సెకండ్ వేవ్ తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది.
కాబట్టి కరోనా కట్టడిలో భాగంగా ప్రభుత్వం లాక్ డౌన్ విధించిందని, అందరు లాక్డౌన్ సమయం లో ఈ నిబంధనలను బాధ్యతగా పాటించాలని సూచించారు.
ఎవరూ అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకూడదని, విధిగా రెండు మాస్కులు తప్పక ధరించాలని, వెంట శానిటైజర్ తప్పక ఉంచుకోవాలని, ఏమైనా కోవిడ్ లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని పేర్కొన్నారు.
ఇకపోతే కరోనా కట్టడిలో భాగంగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో దాదాపు 5 వేల మంది పోలీసులు విధుల్లో పాల్గొంటున్నారని చెప్పారు.కాగా ఈ రోజు కమిషనరేట్ పరిధిలోని సుచిత్ర, గోల్నాక క్రాస్ రోడ్స్, ఆల్విన్ కాలనీ, దూలపల్లి క్రాస్ రోడ్స్ ప్రాంతాల్లో పర్యటించి పై విధంగా వెల్లడించారు.