దేశం మొత్తం బాహుబలి మేనియాలో మునిగిగేలుతోంది.అసలు ఎవరు ఊహించని విధంగా కేవలం ఐదు రోజుల్లో 680-700 కోట్ల గ్రాస్ వసూళ్ళని సాధించింది బాహుబలి 2.
ఇందులో హిందీ వేర్షన్ నుంచి వచ్చిన కలెక్షన్లు 300 కోట్లను గ్రాస్ ని దాటాయి.అక్కడ ఖాన్ త్రయం ఆమీర్, సల్మాన్, షారుఖ్ కి కూడా సాధ్యపడని కలెక్షన్లు సాధిస్తోంది ఈ సినిమా.
గత పదిపదిహేను ఏళ్ళలో థియేటర్ ముఖం చూడని వారు కూడా ఈ సినిమా చూసేందుకు ఎగబడుతున్నారు.దీనికి పదేళ్ళుగా పోలీసులకి అందకుండా దాక్కుంటున్న దొంగ కూడా మినహాయింపు కాదు
బాహుబలి మేనియా ఒక గజదొంగ ని పట్టించింది.అతడు అలాంటి ఇలాంటి దొంగ కాదు.2007 నుంచి పోలీసులకి మూడు నాలుగు చెరువుల నీళ్ళు తాగిస్తున్నాడు.ఒడిష్షా లోని భువనేశ్వర్ లో 50కి పైగా ఏటిఎమ్ లను దోచుకున్న క్రైమ్ రికార్డు తనది.కేసులు కూడా హాఫ్ సెంచరి దాటాయి.ఇన్నాళ్ళుగా అతడి జాడ దొరకలేదు భువనేశ్వర్ పోలీసులకి.మొత్తానికి దశాబ్ద కాలం తరువాత బాహుబలి ఆ దొంగని పట్టించింది.
ఇన్నాళ్ళు దాకున్నాడు కాని, బాహుబలి కోసం జనంలోకి వచ్చాడు.జజ్ పూర్ లోని బలాచంద్రపూర్ కి చెందిన ఇతను మొన్న సోమవారం ఓ థియేటర్లో బాహుబలి సినిమా చూసేందుకు వచ్చి అడ్డంగా దొరికిపోయాడు.
పోలీసులు వెంటనే థియేటర్ దగ్గరకు చేరుకోని అతడిని అరెస్టు చేసారు.ఈరకంగా బాహుబలి చూసేందుకు టంప్ట్ అయి పోలీసులకి చిక్కాడు.దీన్ని బట్టి అర్థం చేసుకోండి, బాహుబలి 2 చూసేందుకు జనాలు ఎంతలా తహతహలాడుతున్నారో!
.