బిగ్ బాస్ సీజన్ 2 లో సామాన్యులకి ఎంట్రీ అవకాశం ఇవ్వడం ద్వారా ఒక్కసారిగా సామాన్యుల కేటగిరీలో విశాఖకు చెందిన నూతన్ నాయుడు అనే వ్యక్తి ఫేమ్ లోకి వచ్చాడు.అంతకు ముందు కొంతకాలం రాజకీయాలు అంటూ ప్రజారాజ్యం పార్టీలో పని చేసిన, తరువాత కిరణ్ కుమార్ రెడ్డి జై సమైక్యాంధ్ర పార్టీ తరుపున ఎమ్మెల్యేగా పోటీ చేసిన రాని గుర్తింపు అతనికి బిగ్ బాస్ తో వచ్చింది.
ఆ బిగ్ బాస్ తో వచ్చిన క్రేజ్ ని ఉపయోగించుకొని అతను ఒక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసి శ్రీరెడ్డి, కత్తి మహేష్ లాంటివారిని ఇంటర్వ్యూలు చేసి కాస్తా గుర్తింపు పెంచుకున్నాడు.ఇక రీసెంట్ గా రామ్ గోపాల్ వర్మ పవర్ స్టార్ అనే సినిమా తీయడంతో అతనికి పోటీగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పరాన్నజీవి అనే సినిమా తీశారు.
ఈ సినిమాతో దర్శకుడుగా కూడా నూతన్ నాయుడు మారిపోయాడు.ఈ సినిమా కారణంగా మీడియా ఫోకస్ కూడా బాగానే గ్రాస్ప్ చేశాడు.ఇదిలా ఉంటే తాజాగా అతనిపై పోలీస్ కేసు నమోదయింది.
పెందుర్తిలోని సుజాతా నగర్ లో ఉన్న తన ఇంట్లో ఓ ఎస్సీ యువకుడికి శిరోముండనం చేయించారంటూ ఆయనపై కేసు నమోదైంది.
శ్రీకాంత్ అనే ఎస్సీ యువకుడు కొన్నాళ్లు నూతన్ నాయుడు ఇంట్లో పనిచేసి మానేశాడు.సెల్ ఫోన్ పోయిందంటూ ఆ ఎస్సీ యువకుడ్ని నూతన్ నాయుడు తన ఇంటికి పిలిపించారు.
ఆపై, నూతన్ నాయుడు ఇంట్లో తనకు శిరోముండనం చేశారంటూ సదరు యువకుడు శ్రీకాంత్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.ఈ విషయాన్ని బయటికి చెబితే చంపేస్తామని బెదిరించారని ఆ యువకుడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
ఇక మీడియా ముందుకి కూడా ఆ శ్రీకాంత్ అనే యువకుడు వచ్చి తనపై దాడి చేసి ఎలా శిరోముండనం చేశారు అనే విషయాలని చెప్పుకొచ్చాడు.శ్రీకాంత్ ఫిర్యాదుపై పోలీసులు యాక్షన్ కి సిద్ధం అయ్యారు.
దీనిపై నూతన్ నాయుడు ఎలా స్పందిస్తాడు అనేది చూడాలి.