కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇండియన్ 2 చిత్రీకరణ సందర్బంగా క్రేజ్ కూలి ముగ్గురు మృతి చెందిన విషయం తెల్సిందే.ముగ్గురు మృతి చెందడటంతో పాటు శంకర్ మరియు కొందరు గాయాల పాలయ్యారు.
దాంతో ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేశారు.సంఘటన స్థలిని పోలీసులు సందర్శించారు.
అక్కడ పరిస్థితులు తీసుకున్న జాగ్రత్తలు మరియు మృతి చెందిన వారు చేసే పని గురించి తెలుసుకున్నట్లుగా తెలుస్తోంది.
ఆ ముగ్గురు మరణించడంతో లైకా ప్రొడక్షన్స్ వారిపై కేసు నమోదు చేసినట్లుగా పోలీసులు ప్రకటించారు.
లైకా ప్రొడక్షన్స్ వారు సరైన జాగ్రత్తలు తీసుకోని కారణంగానే ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలో ఎంక్వౌరీ జరుగుతోంది.ఒకవేళ అదే నిజం అయితే లైకా ప్రొడక్షన్ వారి అనుమతులు అన్ని కూడా క్యాన్సల్ చేసే అవకాశం ఉందని, తద్వారా సినిమా మద్యలోనే ఆగిపోయే ప్రమాదం ఉందంటూ తమిళ సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.