కరోనా కారణంగా సింగర్‌ కనికపై కేసు నమోదు చేసిన యూపీ పోలీసులు

కరోనా ఉదృతి నేపథ్యంలో విదేశాల నుండి వచ్చే వారు తప్పనిసరిగా ముందస్తు కరోనా పరీక్షలు చేయించుకోవాలంటూ ప్రభుత్వాలు పదే పదే చెబుతున్నాయి.కాని బాలీవుడ్‌ సింగర్‌ కనిక కపూర్‌ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించి చిక్కుల్లో పడ్డట్లయ్యింది.

 Police Case File Against In Kanika Kapoore-TeluguStop.com

లండన్‌ నుండి కొన్ని రోజుల క్రితం వచ్చిన కనిక కపూర్‌ స్క్రీనింగ్‌ టెస్టుకు హాజరు కాలేదు.సరే స్వీయ నిర్భందంలోకి వెళ్లినా కూడా సమస్య ఉండేది కాదు.

కాని ఈమె లండన్‌ నుండి వచ్చిన తర్వాత వరుసగా పార్టీల్లో పాల్గొంది.

కరోనా వైరస్‌ పాజిటివ్‌ రిపోర్ట్‌ రావడంతో వారం రోజులుగా ఈమెను కలిసిన వారు భయాందోళనకు గురి అవుతున్నారు.

ఆమెతో పార్టీలో మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే ఇంకా ఎంపీలు ప్రముఖ స్టార్స్‌ కూడా ఆమెను కలిసి పార్టీలో పాల్గొన్నారు.కనుక ఇప్పుడు వారంతా కూడా చాలా ఆందోళనలో ఉన్నారు.

పార్లమెంట్‌కు కూడా కనిక కపూర్‌ తాళూకు కరోనా వైరస్‌ సోకే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం అవుతుంది.ఈ సమయంలోనే ఈమెపై యూపీ పోలీసులు కేసు నమోదు చేశారు.

Telugu Kanika Kapoore, Coronaeffect, Coronakanika-Movie

ప్రభుత్వం అంతగా హెచ్చరికలు జారీ చేస్తున్నా కూడా కరోనా గురించి జాగ్రత్త తీసుకోకుండా విదేశాల నుండి వచ్చి రాగానే పార్టీలో పాల్గొన్న కారణంగా ఆమెపై ప్రమాదకర వైరస్‌ను వ్యాప్తి చేసినందుకు గాను కేసు నమోదు చేస్తున్నట్లుగా పోలీసులు చెప్పారు.ఐపీసీ సెక్షన్‌ 269 కింద కేసును పెట్టినట్లుగా తెలుస్తోంది.ఒక వేళ కేసు నిరూపితం అయితే ఆమెకు ఏడాది నుండి రెండు సంవత్సరాల వరకు జైలు శిక్ష అనుభవించే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube